Corona Third Wave: మహారాష్ట్రలో మళ్ళీ ముంచుకొస్తున్న కరోనా ముప్పు.. మూడో వేవ్ గుమ్మంలో ఉన్నామంటున్న ముఖ్యమంత్రి ఉద్ధవ్

కరోనా మళ్ళీ విరుచుకుపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర మూడోవేవ్ ముంగిట ఉందని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు.

Corona Third Wave: మహారాష్ట్రలో మళ్ళీ ముంచుకొస్తున్న కరోనా ముప్పు.. మూడో వేవ్ గుమ్మంలో ఉన్నామంటున్న ముఖ్యమంత్రి ఉద్ధవ్
Corona Third Wave
Follow us

|

Updated on: Sep 08, 2021 | 9:18 AM

Corona Third Wave: కరోనా మళ్ళీ విరుచుకుపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర మూడోవేవ్ ముంగిట ఉందని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్రలో గత 24 గంటల్లో, 3,626 కొత్త కరోనా సోకినవారు వెలుగులోకి వచ్చు. అదేవిధంగా కరోనా మహామ్మరితో 37 మంది మరణించారు. ముంబైకి మేయర్ కిషోరి పెడ్నేకర్ మంగళవారం మాట్లాడుతూ..”మూడవ వేవ్ ముంబైకి వచ్చింది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.” అని ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి నితిన్ రౌత్ మాట్లాడుతూ నాగ్‌పూర్‌లో రెట్టింపు వేగంతో కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. దీనిని చూసినప్పుడు, నగరంలో మూడో వేవ్ వచ్చినట్లు చెప్పవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు.

పెడ్నేకర్ మాట్లాడుతూ, ”ముంబైలో మూడో వేవ్ రాకూడదని కోరుకున్నం..కానీ, వచ్చింది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆంక్షలు విధించే హక్కు ఉంది. అవసరమైతే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈ విషయాన్ని నిర్ణయిస్తారు.” ప్రజలు తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలని ఆయన అభ్యర్థించారు. గణేశోత్సవంలో బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, ఇంట్లో పూజలు చేయాలని ఆయన సూచించారు.

నాగ్‌పూర్‌లో కఠినమైన ఆంక్షలు విధించవచ్చు..

పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా, కోవిడ్ విపత్తు నిర్వహణ దళ సమావేశం త్వరలో నిర్వహిస్తామని ఇంధన శాఖ మంత్రి నితిన్ రౌత్ అన్నారు. కొన్ని ఆంక్షలు విధించాలని నిర్ణయించారు. అయితే ప్రజా ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు. స్థానిక పరిపాలన త్వరలో కోవిడ్‌కు సంబంధించిన ఆంక్షలను ప్రకటించవచ్చని రౌత్ చెప్పారు.

విదర్భ ప్రాంతంలో, ఆగస్టులో కరోనా కేసులు వేగంగా తగ్గాయి. ఈ ప్రాంతంలో చాలా రోజులుగా కరోనాకు సంబంధించిన ఒక్క మరణం కూడా లేదు. ఆగస్టు 17 నుంచి నాగపూర్ జిల్లాలో అన్ని ఆంక్షలు ఎత్తివేశారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆగస్టులో విదర్భ ప్రాంతంలో కోవిడ్ కేసులు బాగా తగ్గాయి. విదర్భలోని నాగ్‌పూర్ జిల్లాలో ఆగస్టులో సింగిల్ డిజిట్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. అయితే రెండు రోజుల నుంచి ఇక్కడ రెండంకెల కేసులు నమోదవుతున్నాయి.

మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే మాట్లాడుతూ కేరళలో ఓనం పండుగ సందర్భంగా ప్రజలు గుంపులుగా చేరారు. దీంతో అక్కడ కరోనా విరుచుకుపడింది. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం గణేష్ విసర్జన్ కోసం సన్నాహాలు చేస్తోందని చెప్పారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పండుగ కంటే జీవితం ముఖ్యం..

ఉద్ధవ్ ఠాక్రే ఒక రోజు ముందు మనం పండుగను జరుపుకోవచ్చు అని చెప్పారు. మన ప్రజల జీవితాలు, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కొత్త కేసుల పెరుగుదల దృష్ట్యా, పరిస్థితి అదుపు తప్పవచ్చు. పండుగలు, మతపరమైన కార్యక్రమాలను నిషేధించాలని ఎవరు కోరుకుంటారు? కానీ ప్రజల జీవితాలు ముఖ్యం. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. రాబోయే పండుగలు ముఖ్యమైనవి. అదేవిధంగా కఠిన సవాలు సమయం ఇది అని ముఖ్యమంత్రి అన్నారు. పరిస్థితి అదుపు తప్పకుండా చూసుకోవడం రాజకీయ పార్టీల బాధ్యత. కోవిడ్ -19 యొక్క మూడవ వేవ్ మీ తలుపు వద్ద నిలబడి ఉందని థాకరే చెప్పారు. కేరళలో రోజూ 30 వేల కేసులు వస్తున్నాయి. ఇవి ఆందోళనకరమైన సంకేతాలు. మేము దీనిని తీవ్రంగా పరిగణించకపోతే మహారాష్ట్ర భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

మహారాష్ట్రలో గత 24 గంటల్లో కోవిడ్ కేసులు ఇలా..

పూణే డివిజన్‌లో 1267, ముంబైలో 728, నాసిక్ సర్కిల్‌లో 953, కొల్హాపూర్ సర్కిల్‌లో 517, నాగ్‌పూర్ సర్కిల్‌లో కనీసం 14 కొత్త కేసులు నమోదయ్యాయి. నాగ్‌పూర్‌లో సింగిల్ డిజిట్ కేసుల కారణంగా, దాదాపు అన్ని ఆంక్షలు 17 ఆగష్టు నుండి ఎత్తివేశారు. ఇప్పుడు రెండంకెల కేసులు మళ్లీ కఠినత్వం యొక్క కత్తిని బయటకు తీశాయి. ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే మాట్లాడుతూ, ప్రస్తుతం ఎక్కడా ఆంక్షలను పెంచే ఆలోచన లేదని, అయితే ప్రభుత్వం పెరుగుతున్న గణాంకాలను గమనిస్తోందని చెప్పారు.

Also Read: Corona Rules: కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఐదేళ్ళ జైలు శిక్ష! ఎక్కడో తెలుసా?

Corona Medicine: అందుబాటులోకి కోవిడ్ మందు.. టొసిరా డ్రగ్ త‌యారీకి.. హైద‌రాబాద్ హెటిరోకు అనుమ‌తి!