గోమాత ర‌క్ష: క‌రోనా పేషెంట్ల‌కు ‘కౌ ప్లాస్మా’ తో చికిత్స‌

మందులేని మ‌హ‌మ్మారిని నుంచి రోగుల్ని కాపాడేందుకు ఇప్పుడు మ‌న దేశంలోనూ ప్లాస్మా ట్రీట్‌మెంట్‌ను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గో మాత ప్రాముఖ్యత సంతరించుకుందని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు...

గోమాత ర‌క్ష: క‌రోనా పేషెంట్ల‌కు 'కౌ ప్లాస్మా' తో చికిత్స‌
Follow us

|

Updated on: Jul 29, 2020 | 7:49 PM

ప్లాస్మా ట్రీట్‌మెంట్‌.. కరోనా పేషెంట్లకు ఇప్పుడు ఇది ఒక ఆశాదీపం. క‌రోనా బారిన‌ప‌డి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన‌ పేషంట్లకు ప్లాస్మా ట్రీట్‌మెంట్‌ కచ్చితంగా పని చేస్తుందన్నది వైద్యుల‌ మాట. మందులేని మ‌హ‌మ్మారిని నుంచి రోగుల్ని కాపాడేందుకు ఇప్పుడు మ‌న దేశంలోనూ ప్లాస్మా ట్రీట్‌మెంట్‌ను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గో మాత ప్రాముఖ్యత సంతరించుకుందని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కరోనా వైరస్ పోరాటంలో కొందరు అమెరికన్‌ శాస్త్రవేత్తలు ఆవుల‌నే నమ్ముకుంటున్నారు. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం, హ్యుమన్ ప్లాస్మా కంటే గోవుల్లో ఉండే ప్లాస్మాలోనే యాంటి బాడీలు శక్తివంతంగా ఉండటమే ఇందుకు కారణమంటున్నారు. అందుకే ఆవుల్లోనే కృత్రిమంగా కరోనా యాంటి బాడీలను తయారు చేసే ప్రయోగాలు మొద‌లుపెట్టామ‌ని చెబుతున్నారు.

ఆవుల‌కు మనుషులకు సోకే వైరస్ లను ఎదుర్కొనే శక్తి ఉందని ఇప్పటికే రుజువు అయింది. అంత్రాక్స్‌ స్మాల్ పాక్స్, ఇన్ ఫ్లూయెంజా వంటి వైరస్ లకు ఆవు శరీరంలో తయారైన యాంటీ బాడీలతోనే చికిత్స చేస్తారు. కాగా, అవ‌న్నీ విజయవంతం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే శాబ్ బయోథెరాప్యుటిక్స్ అనే ఫార్మా కంపెనీ ప్లాస్మా యాంటీ బాడీల క్లోనింగ్ ను ఆవులలో చేస్తోంది. ఆవుల యాంటీ బాడీలను, హ్యూమన్ యాంటీ బాడీలను కలుపుతున్నారు. ఆ తర్వాత వీటి డీఎన్ ఏ కణాలను ప్రయోగశాలలో ఆవు అండాల్లో ప్రవేశపెడుతున్నారు. అలా ఎదిగే గోవులు తర్వాత కాలంలో యాంటీ బాడీ గనులుగా మారుతాయని సాబ్ బయోథెరాప్యుటిక్స్ సంస్థ చెబుతుంది.

అయితే, ఆవులపై మాత్రమే ఎందుకు ఈ ప్ర‌యోగం చేస్తున్నార‌నే సందేహం చాలా మంది వ్య‌క్తం చేస్తున్నారు. ఎప్ప‌టిలాగే, చిట్టెలుకలు, కోతులపై చేయొచ్చుగా అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే వాటి ద్వారా వచ్చే ప్లాస్మా చాలా తక్కువని అదే గోవుల్లో అయితే ఎటువంటి హాని లేకుండా ప్రతి నెల 30 నుంచి 35 లీటర్లను సేకరించవచ్చని సాబ్ సంస్థ చెబుత‌న్న మాట‌.

read more: https://tv9telugu.com/ts-covid-testing-mobile-vehicle-285377.html