AP Corona: ఏపీలో గత 24 గంటల్లో భారీగా తగ్గిన కరోనా కేసులు.. ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?
AP Corona Updates: ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం భారీగా తగ్గుముఖం పట్టిన కేసులు కాస్తా.. ఇటీవల మళ్లీ వంద మార్క్ దాటిన సంగతి తెలిసిందే. తాజాగా మళ్లీ..
AP Corona Updates: ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం భారీగా తగ్గుముఖం పట్టిన కేసులు కాస్తా.. ఇటీవల మళ్లీ వంద మార్క్ దాటిన సంగతి తెలిసిందే. తాజాగా మళ్లీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో కొత్తగా 74 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ సోమవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది.
తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 8,90,766 కి చేరింది. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 7176 కి పెరిగింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 61 మంది కోలుకున్నారు. తాజాగా కోలుకున్న వారితో కలిపి వైరస్ నుంచి ఇప్పటివరకు 8,82,581 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,009 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
ఇదిలాఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల వ్యవధిలో 25, 907 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,42,62,086 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్లో వివరించింది. గత 24 గంటల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
కాగా.. కరోనా కేసులు పెరుగుతుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. మహమ్మారిని అరికట్టేందుకు ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: