AP Corona Cases: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 1,628 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా
ఆంధ్రప్రదేశ్లో కరోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 71,152 శాంపిల్స్ టెస్ట్ చేయగా....
ఆంధ్రప్రదేశ్లో కరోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 71,152 శాంపిల్స్ టెస్ట్ చేయగా, 1,628 మందికి కరోనా సోకినట్లు తేలింది. కోవిడ్ వల్ల చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కృష్ణాలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, అనంతపూరంలో ఇద్దరు, తూర్పు గోదావరి, కర్నూల్, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కొత్తగా 24 గంటల వ్యవధిలో 2,744 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారని, వైద్యారోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్లో తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 2,36,64,207 శాంపిల్స్ పరీక్షించినట్టు వెల్లడించింది.
జిల్లాల వారీగా కేసుల వివరాలను దిగువన చూడండి….
#COVIDUpdates: 19/07/2021, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,38,829 పాజిటివ్ కేసు లకు గాను *19,02,105 మంది డిశ్చార్జ్ కాగా *13,154 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 23,570#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/xzIixwJSqq
— ArogyaAndhra (@ArogyaAndhra) July 19, 2021
80% కరోనా కేసులకు ఆ వేరియంటే కారణం: డాక్టర్ ఎన్కే. అరోడా
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణకు కారణమైన డెల్టా వేరియంట్ గురించి కీలక విషయాలు వెల్లడించారు సార్స్ కొవ్-2 జీనోమ్ కన్సార్టియమ్ అధిపతి డాక్టర్ ఎన్కే. అరోడా. దేశంలో కొత్తగా వెలుగుచూస్తున్న కరోనా కేసుల్లో 80శాతానికిపైగా కేసులకు ఈ వేరియంటే కారణమవుతోందని తెలిపారు. అంతకుముందు ఉన్న అల్ఫా వేరియంట్ కన్నా డెల్టా వేరియంట్.. 40 నుంచి 60 శాతం అధికంగా వ్యాప్తి చెందుతోందని వివరించారు. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, సింగపూర్ సహా 80 దేశాలకు ఈ వేరియంట్ వ్యాపించిందని పేర్కొన్నారు. డెల్టా వేరియంట్ స్పైక్ ప్రొటీన్ ఉత్పరివర్తనాలు.. కణాల ఉపరితలంతో ఉండే ఏసీఈ2 గ్రాహకాలతో తొందరగా కలిసిపోతోందని.. తద్వారా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోందని తెలిపారు.
Also Read: భరతమాతకు జై కొట్టిన వార్నర్.. ఇంటర్నెట్లో వీడియో వైరల్