లాక్‌డౌన్ః వారికి రూ. 5వేలు సాయం ప్ర‌క‌టించిన ఏపీ స‌ర్కార్‌

క‌రోనా నేప‌థ్యంలో దేశంలో లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆదాయం లేని వారికి... రూ. 5 వేలు సాయం..

లాక్‌డౌన్ః వారికి రూ. 5వేలు సాయం ప్ర‌క‌టించిన ఏపీ స‌ర్కార్‌
Follow us

|

Updated on: Apr 09, 2020 | 7:15 AM

క‌రోనా నేప‌థ్యంలో దేశంలో లాక్‌డౌన్ కొన‌సాగుతోంది.ప్ర‌జ‌లు గ‌డ‌ప‌దాటి బ‌య‌ట‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌భుత్వ, ప్రైవేటు రంగాలు అన్ని మూత‌ప‌డ్డాయి. విద్యా,వ్యాపార, ర‌వాణా వ్య‌వ‌స్థ‌లు స్థంబించిపోయాయి. ఆఖ‌రుకు దేవాల‌యాల‌కు కూడా తాళాలు వేశారు. దీంతో దేవుడికి నిత్య‌కైంక‌ర్యాలు నిర్వ‌హించే అర్చ‌కుల ప‌రిస్థితి అధ్వాన్నంగా మారింది. ఈ నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యంతో వేలాది మంది అర్చ‌కుల‌కు ల‌బ్ఢి చేకూర‌నుంది.
లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఆలయాల్లో భక్తుల దర్శనాలు నిలిపివేశారు. దీంతో ఆదాయం కోల్పోయిన అర్చకులను ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఈ మేర‌కు సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో.. చిన్న ఆలయాల్లో పనిచేసే అర్చకులకు రూ. 5,000లు గ్రాంట్‌ రూపంలో చెల్లించనున్నట్లు దేవదాయ శాఖ మంత్రి శ్రీనివాసరావు తెలిపారు. దేవదాయ శాఖ నుంచి ఎలాంటి నెలవారీ జీతాలు పొందని, ధూప దీప నైవేద్యం వంటి పథకాల ద్వారా లబ్ధి పొందని వారికి అర్చక సంక్షేమ నిధి నుంచి ఈ సాయాన్ని అందజేయనున్నారు.
క‌రోనా నేప‌థ్యం, లాక్‌డౌన్‌కు ముందు నుంచే ఆలయాల్లోకి భక్తులను అనుమతించడం లేదు. దీంతో అర్చకులు మాత్రమే ఏకాంతంగా నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. చిన్న ఆలయాలకు ఎలాంటి ఆదాయం లేదు.. అర్చకుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. అందుకే అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌ ద్వారా ఒక్కొక్కరికి రూ. 5000 గ్రాంట్ ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు.  రాష్ట్రవ్యాప్తంగా ధూప దీప నైవేద్యం, అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌ ద్వారా 2,800 మందికి పైగా అర్చకులకు ప్రతి నెలా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం వర్తించని వారు రాష్ట్ర వ్యాప్తంగా 2,500 మంది అర్చకులు ఉన్నారు. సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో వారంతా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్