ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతన్న కరోనా తీవ్రత.. ఇవాళ కొత్తగా 51 మందికి పాజిటివ్.. ఇద్దరు మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 51 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృత్యువాతపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతన్న కరోనా తీవ్రత.. ఇవాళ కొత్తగా 51 మందికి పాజిటివ్.. ఇద్దరు మృతి
Coronavirus Cases In AP
Follow us

|

Updated on: Feb 17, 2021 | 6:18 PM

AP Corona cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 51 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. 26 వేల 474 శాంపిల్స్ పరీక్షించినట్లు, చిత్తూరు, కృష్ణా జిల్లాలో ఒక్కరు చొప్పున చనిపోయారని తెలిపింది. గడిచిన 24 గంటల్లో 57 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారని, బుధవారం సాయంత్రం వరకు రాష్ట్రంలో 20,79,77,229 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని వెల్లడించింది. మొత్తంగా ఏపీ రాష్ట్రంలో 8 లక్షల 80 వేల 712కి కరోనా కేసులు చేరుకున్నాయి. 7 వేల 165 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. ప్రస్తుతం ఏపీలో 607 యాక్టివ్ కేసులు ఉండగా.. 8 లక్షల 81వేల 238 మంది డిశ్చార్జ్ అయ్యారు.

జిల్లాల వారీగా పాజిటివ్ కేసులను పరిశీలిస్తే :

అనంతపురం : 04. చిత్తూరు 14. ఈస్ట్ గోదావరి : 03. గుంటూరు : 04. కడప : 01. కృష్ణా : 06. కర్నూలు : 02. నెల్లూరు : 03. శ్రీకాకుళం : 01. విశాఖపట్టణం : 08. విజయనగరం : 02. వెస్ట్ గోదావరి : 03. మొత్తం 51 పాజిటివ్ కేసులు.

ఇదీ చదవండి… మానవత్వం చాటుకున్న బొబ్బిలి సీఐ.. వృద్ధురాలిని పోలింగ్‌ కేంద్రం వరకు ఎత్తుకెళ్లిన కేశవరావు