షాకింగ్ న్యూస్ః మర్కజ్ తరహాలో మరో ఘటన..

దేశంలో క‌రోనా వ్యాప్తికి అజ్యం పోసిన సంఘ‌ట‌న ఢిల్లీలోని మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌లేన‌న్న‌ది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఇదే తరహాలో ఇప్పుడు మరో మసీదు ఘటన కలకలం రేపుతోంది. ఆ ప్రార్థ‌న‌ల తాలూకు ఆన‌వాళ్లు..

షాకింగ్ న్యూస్ః మర్కజ్ తరహాలో మరో ఘటన..
Follow us

|

Updated on: Apr 14, 2020 | 6:20 AM

దేశంలో క‌రోనా వ్యాప్తికి అజ్యం పోసిన సంఘ‌ట‌న ఢిల్లీలోని మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌లేన‌న్న‌ది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. మసీదులో ప్రార్థనల ఘటన సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. ఈ మత సమావేశాలకు హాజరైన వారి కారణంగా దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు కరోనా విస్త‌రించింది.  తెలుగు రాష్ట్రాల్లోని చాలా జిల్లాల‌పై కోవిడ్ ప్ర‌భావం ప‌డింది.  నాలుగైదు రోజుల్లోనే కేసులు అమాంతం పెరిగాయి. ఇదే తరహాలో ఇప్పుడు మరో మసీదు ఘటన కలకలం రేపుతోంది. ఆ ప్రార్థ‌న‌ల తాలూకు ఆన‌వాళ్లు తెలంగాణ‌లోని నిజ‌మాబాద్ జిల్లాలో వెలుగులోకి వ‌చ్చాయి.

నిజామాబాద్ జిల్లాలో ఏప్రిల్ 13న రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. బాధితుల ట్రావెల్ హిస్టరీ గురించి ఆరా తీయగా.. వీరిద్దరూ యూపీలోని దియోబంద్‌ మసీదులో జరిగిన మత కార్యక్రమంలో పాల్గొని వచ్చినట్లుగా తేలింది. వీరితో పాటు మరో 20 మంది వరకూ ఇదే మసీదుకు వెళ్లినట్లుగా అధికారులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెయ్యిమందికి పైగా ఈ మ‌త‌ప్రార్థ‌న‌ల‌కు వెళ్లినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా మ‌రోమారు ఆందోళ‌న మొద‌లైంది. వీరంతా దియోబంధుతో పాటు అజ్మీర్ దర్గాను కూడా సందర్శించినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది.

వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన రాష్ట్ర ప్రభుత్వం.. దియోబంధుదియోబంద్‌ మసీదుకు వెళ్లొచ్చిన వారి సమాచారాన్ని సేకరించాలని  అధికారులను ఆదేశించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ మర్కజ్ మసీదులో ప్రార్థనలు నిర్వహించిన తబ్లిగీ జమాత్ కార్యకర్తలే ఆ సమావేశాల అనంతరం ఉత్తరప్రదేశ్‌లోని దియోబంద్‌కు వెళ్లినట్లు సమాచారం. నిజాముద్దీన్ తరహాలోనే యూపీలో ప్రార్థనలు జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం అక్కడ నుంచి పెద్ద సంఖ్యలో రాజస్థాన్‌లోని ఆజ్మీర్ దర్గాను సందర్శించినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సమాచారంతో కేంద్రం.. ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు