Mumbai: ముంబైలో 80 శాతం మందికి కరోనా.. కీలక విషయాలు వెల్లడించిన టీఐఎఫ్ఆర్c
TIFR report: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. నిత్యం నాలుగు లక్షల వరకు నమోదైన కేసులు.. ఇప్పుడు నలభై వేలు
TIFR report: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. నిత్యం నాలుగు లక్షల వరకు నమోదైన కేసులు.. ఇప్పుడు నలభై వేలు నమోదవుతున్నాయి. కరోనా ప్రారంభం నాటినుంచి మహారాష్ట్రలో కరోనా విలయతాండం సృష్టించింది. కేసుల పరంగా మరణాల పరంగా దేశంలో మొదటి స్థానంలో నిలించింది. అయితే.. ఆర్థిక రాజధాని ముంబైలో కూడా కరోనా హాట్స్పాట్గా మారిన సంగతి తెలిసిందే. కఠిన నిబంధనల అనంతరం అక్కడ కూడా కరోనా తగ్గుముఖం పడుతోంది. అయితే.. ముంబైలో ఇప్పటికే 80 శాతం ప్రజలు కరోనా బారినపడి ఉండవచ్చని ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ కారణంగా థర్డ్ వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని పేర్కొంది. అయితే, థర్డ్ వేవ్లో రీ ఇన్ఫెక్షన్లది కీలక పాత్ర కానుందని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) స్పష్టం చేసింది.
ఇప్పటివరకు రెండోసారి కరోనా (రీ ఇన్ఫెక్షన్లు) సోకినవారు తక్కువగా ఉండటమే దీనికి కారణమంటూ విశ్లేషించింది. ఈ మేరకు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) అధ్యయనం విషయాలను మంగళవారం వెల్లడించింది. కోవిడ్ సోకని మిగతా 20% మందికి త్వరగా టీకా ఇవ్వడంతో పాటు రీ ఇన్ఫెక్షన్లపై దృష్టిపెట్టడం ద్వారా థర్డ్ వేవ్ తీవ్రతను ముందే పసిగట్టొచ్చని.. ఆ తర్వాత చర్యలు, ప్రణాళికతో ముందుకు వెళ్లవచ్చని టీఐఎఫ్ఆర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్ డీన్ డాక్టర్ సందీప్ జునేజా తెలిపారు. అయితే.. కరోనా రీ ఇన్ఫెక్షన్ల తీవ్రత ప్రకారం థర్డ్ వేవ్ను అంచనా వేయవచ్చిని పేర్కొన్నారు. సెకండ్ వేవ్లో ఢిల్లీ, బెంగళూరు కంటే అత్యధిక కేసులు ముంబైలోనే నమోదయ్యాయని తెలిపారు. దీని ప్రకారం చూస్తే థర్డ్ వేవ్ తీవ్రత అంతగా ఉంకపోవచ్చని పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. దేశంలో 102 రోజుల తర్వాత కరోనా కేసులు 40 వేల దిగువన నమోదయ్యాయి. సోమవారం 37,566 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. 907 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read: