షాకింగ్.. 560 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్..
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా నమోదైన కేసులు.. తొంభై వేలకు చేరాయి. కరోనా పురుడు పోసుకున్న చైనాను కూడా ఇండియా దాటేసింది. ఈ క్రమంలో కరోనా కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇతర రాష్ట్రాల్లో ఇరుక్కుపోయిన వలస కార్మికులు చాలా మంది.. కాలినడకన, ప్రభుత్వం ఏర్పాటు చేసిన రవాణా వ్యవస్థల ద్వారా స్వస్థలాలకు వెళ్తున్నారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత.. వారిని […]
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా నమోదైన కేసులు.. తొంభై వేలకు చేరాయి. కరోనా పురుడు పోసుకున్న చైనాను కూడా ఇండియా దాటేసింది. ఈ క్రమంలో కరోనా కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇతర రాష్ట్రాల్లో ఇరుక్కుపోయిన వలస కార్మికులు చాలా మంది.. కాలినడకన, ప్రభుత్వం ఏర్పాటు చేసిన రవాణా వ్యవస్థల ద్వారా స్వస్థలాలకు వెళ్తున్నారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత.. వారిని కొద్ది రోజుల పాటు క్వారంటైన్ సెంటర్లలో ఉంచి ఆ తర్వాత.. వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా బీహార్ రాష్ట్రంలో 560 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్ సోకినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని బీహార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఢిల్లీ, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వారిని.. బార్డర్లోని పలు క్వారంటైన్ సెంటర్లలో ఉంచారు. అయితే వీరికి పరీక్షలు నిర్వహించగా.. 560 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఇంకా మరో 2746 మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.