దేశంలో 81,970 కరోనా కేసులు.. గడిచిన 24 గంటల్లో 100 మరణాలు..
దేశంలో కరోనా వైరస్ ఉద్దృత్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 3,967 కేసులు నమోదు కాగా, 100 మంది ప్రాణాలు విడిచారు. దీనితో ఇప్పటివరకు 81970 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అందులో 51401 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. 27919 మంది కోలుకున్నారని వెల్లడించింది. అటు మరణాల సంఖ్య 2649కి చేరినట్లు తెలిపింది. ఇక మహారాష్ట్ర, […]
దేశంలో కరోనా వైరస్ ఉద్దృత్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 3,967 కేసులు నమోదు కాగా, 100 మంది ప్రాణాలు విడిచారు. దీనితో ఇప్పటివరకు 81970 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అందులో 51401 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. 27919 మంది కోలుకున్నారని వెల్లడించింది. అటు మరణాల సంఖ్య 2649కి చేరినట్లు తెలిపింది. ఇక మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, యూపీలలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది.
Watch Live: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం
తాజా సమాచారం ప్రకారం ఏపీ-2205, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ – 33, అరుణాచల్ ప్రదేశ్ – 1, అస్సాం – 87, బీహార్ – 994, ఛండీగర్-191, ఛత్తీస్ఘడ్-60, దాదర్ నగర్ హవేలీ- 1, ఢిల్లీ-8470, గోవా-14, గుజరాత్-9591, హర్యానా-818, హిమాచల్ప్రదేశ్-74, జమ్ముకశ్మీర్-983, జార్ఖండ్ – 197, కర్ణాటక- 987, కేరళ-560, లడాక్-43, మధ్యప్రదేశ్-4426, మహారాష్ట్ర-27524, మణిపూర్-3, మిజోరం- 1, మేఘాలయా- 13, నాగాలాండ్- 0, ఒడిశా – 611, పుదుచ్చేరి -13, పంజాబ్-1935, రాజస్థాన్-4534, తమిళనాడు-9674, తెలంగాణ-1414, త్రిపుర – 156, ఉత్తరాఖండ్ – 78, యూపీ-3902, పశ్చిమ బెంగాల్-2377 కేసులు ఉన్నాయి. అటు కరోనా మరణాలు అత్యధికంగా మహారాష్ట్ర(1019)లో సంభవించగా.. ఆ తర్వాత గుజరాత్(586), మధ్యప్రదేశ్(237), వెస్ట్ బెంగాల్(215), రాజస్తాన్(125)రాష్ట్రాలు ఉన్నాయి.
Read This: ఫెయిలైన స్టూడెంట్స్కు మళ్లీ పరీక్షలు..