ఏపీలో అంతకంతకూ విజృంభిస్తోన్న కరోనా.. కొత్తగా 68 కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తూనే ఉంది. ఈ రోజు కొత్తగా ఏపీలో 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రా వ్యాప్తంగా కరోనా కేసులు 2,407కి చేరాయి. అలాగే కరోనా వైరస్తో ఇప్పటివరకూ 53 మంది మృతి చెందగా...
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తూనే ఉంది. ఈ రోజు కొత్తగా ఏపీలో 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రా వ్యాప్తంగా కరోనా కేసులు 2,407కి చేరాయి. అలాగే కరోనా వైరస్తో ఇప్పటివరకూ 53 మంది మృతి చెందగా.. 1,639 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా ప్రస్తుతం ఆస్పత్రిలో 715 మంది చికిత్స పొందుతున్నారు.
కొత్తగా వచ్చిన పాజిటివ్ కేసుల్లో చిత్తూరులో ఆరు, నెల్లూరులో నాలుగు కేసులకు తమిళనాడులోని కోయంబేడు మార్కెట్తో లింకులు ఉన్నట్లు తెలిసింది. ఏపీలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారి పాజిటివ్ కేసులు 153 ఉన్నాయి. వాటిలో ఒడిశా నుంచి 10, మహా రాష్ట్ర నుంచి 101, గుజరాత్ నుంచి 26, ఇక కర్నాటక, బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాలకు సంబంధించి ఒక్కో కేసు ఉంది. కాగా ఆంధ్రాలో నిన్న 9159 మంది శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 68 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో వెంటనే వారిని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు అధికారులు.
ఇది కూడా చదవండి: