ఇద్దరికి కరోనా పాజిటివ్.. ఆ ఫ్లైట్‌లో వచ్చిన ప్రయాణికుల్లో టెన్షన్..!

రోజు రోజుకు కరోనా మహమ్మారి విస్తరిస్తోన్న క్రమంలో అందరిలో భయం పెరుగుతోంది. ఈ వైరస్ సోకిన వారిలో ఇప్పటికే దాదాపుగా 500మంది మృత్యువాత పడటం.. వేల మందికి పాజిటివ్ లక్షణాలు ఉండటం, ఇంకా విరుగుడును కనుక్కోకపోవడంతో.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భయపడుతున్నారు. ఈ క్రమంలో ఇండిగో ఫ్లైట్ ప్రయాణం ఇప్పుడు కలకలం రేపుతోంది. జనవరి సంక్రాంతి సమయంలో ప్రయాణించిన వారికి, విమాన సిబ్బందికి కరోనా టెస్టులు నిర్వహించారు వైద్యులు. వారిలో ఇద్దరికి కరోనా లక్షణాలు కనిపించాయి. ఆ ఇద్దరు […]

ఇద్దరికి కరోనా పాజిటివ్.. ఆ ఫ్లైట్‌లో వచ్చిన ప్రయాణికుల్లో టెన్షన్..!
Follow us

| Edited By:

Updated on: Feb 05, 2020 | 12:39 PM

రోజు రోజుకు కరోనా మహమ్మారి విస్తరిస్తోన్న క్రమంలో అందరిలో భయం పెరుగుతోంది. ఈ వైరస్ సోకిన వారిలో ఇప్పటికే దాదాపుగా 500మంది మృత్యువాత పడటం.. వేల మందికి పాజిటివ్ లక్షణాలు ఉండటం, ఇంకా విరుగుడును కనుక్కోకపోవడంతో.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భయపడుతున్నారు. ఈ క్రమంలో ఇండిగో ఫ్లైట్ ప్రయాణం ఇప్పుడు కలకలం రేపుతోంది. జనవరి సంక్రాంతి సమయంలో ప్రయాణించిన వారికి, విమాన సిబ్బందికి కరోనా టెస్టులు నిర్వహించారు వైద్యులు. వారిలో ఇద్దరికి కరోనా లక్షణాలు కనిపించాయి. ఆ ఇద్దరు కేరళకు చెందిన వారు కాగా.. అదే విమానంలో అప్పుడు ప్రయాణించిన మిగిలిన వారిలో ఇప్పుడు ఆందోళన నెలకొంది. దీంతో వారంతా గాంధీ ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోనున్నారు.