విజయవాడను గడగడలాడిస్తోన్న కరోనా..ఇద్దరి నుంచి అరవై మందికి
విజయవాడలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉంది. రెడ్జోన్లలోనే కేసులు ఎక్కువగా వస్తున్నాయి. మొత్తం కృష్ణా జిల్లాలోనే 177 పాజిటివ్ కేసులు ఉంటే, ఒక్క విజయవాడలోనే 150 కేసులు ఉండటం ఆందోళన కలిగించే అంశం. పైగా ఇందులో ఇద్దరి వల్లే 60 కేసులు రావడం మరింత కలవరం కలిగిస్తోంది. మరో 41 కేసులకు ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ మూలాలున్నాయి. కొందరికి వైరస్ ఎలా వచ్చిందో కూడా తెలియని పరిస్థితి. కృష్ణలంక, కార్మికనగర్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కృష్ణలంకలో […]
విజయవాడలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉంది. రెడ్జోన్లలోనే కేసులు ఎక్కువగా వస్తున్నాయి. మొత్తం కృష్ణా జిల్లాలోనే 177 పాజిటివ్ కేసులు ఉంటే, ఒక్క విజయవాడలోనే 150 కేసులు ఉండటం ఆందోళన కలిగించే అంశం. పైగా ఇందులో ఇద్దరి వల్లే 60 కేసులు రావడం మరింత కలవరం కలిగిస్తోంది. మరో 41 కేసులకు ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ మూలాలున్నాయి. కొందరికి వైరస్ ఎలా వచ్చిందో కూడా తెలియని పరిస్థితి. కృష్ణలంక, కార్మికనగర్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కృష్ణలంకలో లారీ డ్రైవర్ ద్వారా 24 మందికి కరోనా సోకింది. అతడు పేకాట ఆడటంతో వైరస్ వ్యాప్తి చెందింది. మాచవరం కార్మికనగర్కు చెందిన ఓ యువకుడి ద్వారా 36 మందికి కరోనా అంటుకుంది. స్థానికంగా టిఫిన్ దుకాణం నడుపుతున్నాడా యువకుడు.
మరో పది మంది పోలీసులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. వీరంతా రెడ్జోన్లలో పని చేసిన వారే!. పాజిటివ్ వచ్చినవారిలో ఒక ఏడీసీపీ, ఒక మహిళా ఎస్సై, ఏడుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. మరో ఎస్సైకి రెండురోజుల క్రితం పాజిటివ్ వచ్చింది. విజయవాడలోని రెడ్జోన్లలో పనిచేస్తూ ఏడీసీపీ సహా ఎక్కువమంది వైరస్ బారిన పడ్డారు. నిన్న జిల్లాలో కొత్తగా 52 కేసులు వస్తే .. ఒక్క విజయవాడలోనే 47 పాజిటివ్ కేసులు వచ్చాయి. గాంధీనగర్లో ఓ వృద్దురాలు మృతి చెందింది. ఆమె అంత్యక్రియలలో పాల్గొన్న అయిదుగురికి పాజిటివ్ వచ్చింది. ఇలా ఒకే చోటు నుంచి వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ఆయా ప్రాంతాలలో మరింత కఠినంగా ఆంక్షలను అమలుచేస్తున్నారు పోలీసులు.