ఇకపై ప్రైవేట్ ల్యాబ్స్ల్లోనూ కరోనా పరీక్షలు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
Coronavirus: తెలుగు రాష్ట్రాలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. ఇప్పటికే తెలంగాణలో 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేటు ల్యాబ్స్లలోనూ కరోనా పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రి ల్యాబోరేటరీ సర్వీసెస్, హిమాయత్ నగర్లోని విజయ డయాగ్నస్టిక్ సెంటర్, చర్లపల్లిలోని విమ్టా ల్యాబ్స్, బోయిన్పల్లిలోని అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్, శేరిలింగంపల్లిలోని అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ అండ్ ల్యాబ్ […]
Coronavirus: తెలుగు రాష్ట్రాలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. ఇప్పటికే తెలంగాణలో 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేటు ల్యాబ్స్లలోనూ కరోనా పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రి ల్యాబోరేటరీ సర్వీసెస్, హిమాయత్ నగర్లోని విజయ డయాగ్నస్టిక్ సెంటర్, చర్లపల్లిలోని విమ్టా ల్యాబ్స్, బోయిన్పల్లిలోని అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్, శేరిలింగంపల్లిలోని అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ అండ్ ల్యాబ్ సర్వీసెస్, న్యూబోయిన్పల్లిలోని మెడిసిన్ పాథ్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, పంజగుట్టలోని డాక్టర్ రెమెడీస్ ల్యాబ్స్, మేడ్చల్ లోని పాథ్ కేర్ ల్యాబ్స్లలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
అటు సోమాజిగూడ, సికింద్రాబాద్, మలక్పేట్లోని యశోద ఆసుపత్రుల్లోనూ కరోనా వైరస్ బాధితులకు అవసరమైన క్వారంటైన్లను ఏర్పాటు చేశారు. కాగా, రాష్ట్రంలో 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒకరు మృతి చెందగా.. ఆదివారం 11 మందికి వ్యాధి నుంచి కోలుకోగా.. మరో 58 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా నియంత్రణకు ప్రజలందరూ కూడా సామాజిక దూరాన్ని పాటించాలని మరోసారి సీఎం కేసిఆర్ విజ్ఞప్తి చేశారు.
ఇది చదవండి: గుడ్ న్యూస్.. ఏపీలో కోలుకున్న మరో కరోనా బాధితుడు..