సుప్రీంలో ఒకే బెంచ్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ
భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోయిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి కేవలం అత్యవసర పిటిషన్లను మాత్రమే విచారించాలని..అవి కూడా ఇద్దరు జడ్జులతో కూడిన ఒక్క బెంచ్ మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినాలని డిసైడయ్యింది. అడ్వకేట్స్ వేరే గదిలో వాదనలు వినిపిస్తూ ఉండగా..న్యాయమూర్తులు కోర్టులో విచారణ చేయనున్నారు. ఈ మేరకు జస్టిస్ ఎస్.ఏ బోబ్డే, జస్టిస్ డీ.వై చంద్రచూడ్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తి […]
భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోయిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి కేవలం అత్యవసర పిటిషన్లను మాత్రమే విచారించాలని..అవి కూడా ఇద్దరు జడ్జులతో కూడిన ఒక్క బెంచ్ మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినాలని డిసైడయ్యింది. అడ్వకేట్స్ వేరే గదిలో వాదనలు వినిపిస్తూ ఉండగా..న్యాయమూర్తులు కోర్టులో విచారణ చేయనున్నారు. ఈ మేరకు జస్టిస్ ఎస్.ఏ బోబ్డే, జస్టిస్ డీ.వై చంద్రచూడ్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ పాటించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు ఈ నెల 31వ వరకు ఢిల్లీలో లాక్డౌన్ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.