గుడ్ న్యూస్.. భారత్లో మిలియన్ దాటిన రికవరీ కేసులు..
దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అన్లాక్ ప్రక్రియ మొదలుకావడంతో కొన్ని రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది.
Coronavirus Recoveries In India: దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అన్లాక్ ప్రక్రియ మొదలుకావడంతో కొన్ని రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే ఇలాంటి తరుణంలో కేంద్రం కాస్త ఊరటను కలిగించే విషయాన్ని వెల్లడించింది. మిగతా దేశాలతో పోలిస్తే భారత్లో రికవరీ శాతం ఎక్కువగా ఉందని వెల్లడించింది.
కరోనా యాక్టివ్ కేసుల కంటే రెండు రెట్లు ఎక్కువగా రికవరీ కేసులు ఉండటం శుభ పరిణామం. ఇప్పటివరకు దేశంలో 1,029,069 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో రికవరీ రేట్ 64.44 శాతం ఉండగా.. మరణాల రేటు 2.21 శాతం ఉంది. అటు ప్రపంచవ్యాప్తంగా కూడా రికవరీ కేసుల సంఖ్య పెరుగుతుండటం విశేషం. ప్రపంచంలో ప్రస్తుతం 17,308,879 పాజిటివ్ కేసులు ఉండగా.. 672,483 మంది వైరస్ కారణంగా మరణించారు. ఇక 10,791,135 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది.
Also Read:
అరగంటలో పేషెంట్ అడ్మిట్ కావాలి.. సీఎం జగన్ సీరియస్ వార్నింగ్..