దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు..
భారత్లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. కొత్తగా గడిచిన 24 గంటల్లో 36,470 కేసులు, 488 మరణాలు సంభవించాయి. దీనితో దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్
Coronavirus Cases India: భారత్లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. కొత్తగా గడిచిన 24 గంటల్లో 36,470 కేసులు, 488 మరణాలు సంభవించాయి. దీనితో దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 79,46,429కి చేరుకుంది. ఇందులో 6,25,857 యాక్టివ్ కేసులు ఉండగా.. 1,19,502 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. అలాగే 72,01,070 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్క రోజులో 63,842 మంది కోలుకున్నారు.
కాగా, అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 16,48,665 చేరుకోగా.. అందులో 14,70,660 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే ఇండియాలో యాక్టివ్ కేసుల 7.88 శాతంగా ఉండగా.. రికవరీ కేసులు 90.62 శాతంగా.. డెత్ టోల్ 1.50 శాతంగా ఉంది. అక్టోబర్ 26వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 10,44,20,894 కరోనా టెస్టులు నిర్వహించారు.
Also Read:
ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. డీఏల చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్..
లాక్డౌన్లో బ్యాంకు ఈఎంఐలు చెల్లించారా? అయితే క్యాష్బ్యాక్ మీ సొంతం!