ఏపీలో తగ్గిన కరోనా ఉదృతి.. పెరుగుతోన్న రికవరీ కేసులు..
Coronavirus Positive Cases: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,967 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,75,470కి చేరింది. ఇందులో 38,979 యాక్టివ్ కేసులు ఉండగా.. 7,30,109 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 25 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,382కు చేరుకుంది. ఇక నిన్న 5,010 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. […]
Coronavirus Positive Cases: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,967 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,75,470కి చేరింది. ఇందులో 38,979 యాక్టివ్ కేసులు ఉండగా.. 7,30,109 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 25 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,382కు చేరుకుంది. ఇక నిన్న 5,010 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.
నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 233, చిత్తూరు 510, తూర్పుగోదావరి 608, గుంటూరు 246, కడప 212, కృష్ణా 456, కర్నూలు 100, నెల్లూరు 220, ప్రకాశం 355, శ్రీకాకుళం 108, విశాఖపట్నం 206, విజయనగరం 80, పశ్చిమ గోదావరి 627 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,09,044కి చేరింది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 732 మంది కరోనాతో మరణించారు.