ఏపీ కరోనా తగ్గుముఖం.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే.!
ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే కొద్దిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 72,838 శాంపిల్స్ను పరీక్షించగా 7,228 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది.
ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే కొద్దిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 72,838 శాంపిల్స్ను పరీక్షించగా 7,228 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,46,530కి చేరింది. ఇందులో 70,357 యాక్టివ్ కేసులు ఉండగా.. 5,70,667 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో 45 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 5,506కు చేరుకుంది. నేటి వరకు రాష్ట్రంలో 53.02 లక్షల కరోనా టెస్టులు జరిగాయి.
నిన్న కోవిడ్ వల్ల చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతి చెందగా.. కృష్ణలో ఐదుగురు, తూర్పుగోదావరి, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందగా.. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 90 వేలు దాటగా.. చిత్తూరులో అత్యధికంగా 609 మంది కరోనాతో మరణించారు. (Coronavirus Positive Cases)
Also Read:
మందుబాబులకు మరో గుడ్ న్యూస్.. ఏపీలో బార్లకు గ్రీన్ సిగ్నల్..
శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..
ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు..
#COVIDUpdates: 23/09/2020, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 6,43,635 పాజిటివ్ కేసు లకు గాను *5,67,772 మంది డిశ్చార్జ్ కాగా *5,506 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 70,357#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/vVZ78EuII4
— ArogyaAndhra (@ArogyaAndhra) September 23, 2020