Coronavirus Telangana: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 415 పాజిటివ్ కేసులు నమోదు..

Coronavirus Positive Cases In Telangana: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 415 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో..

Coronavirus Telangana: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి..  కొత్తగా 415 పాజిటివ్ కేసులు నమోదు..
Follow us

|

Updated on: Dec 31, 2020 | 10:40 AM

Coronavirus Positive Cases In Telangana: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 415 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,86,354కి చేరింది. ఇందులో 5,974 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,78,839 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో 316 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ముగ్గురు మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 1541కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 43,413 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 68,82,694కి చేరింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ 6, భద్రాద్రి కొత్తగూడెం 9, జీహెచ్ఎంసీ 91, జగిత్యాల 6, జనగాం 5, జయశంకర్ భూపాలపల్లి 7, గద్వాల్ 2, కామారెడ్డి 3, కరీంనగర్ 33, ఖమ్మం 11, ఆసిఫాబాద్ 4, మహబూబ్ నగర్ 5, మహబూబాబాద్ 7, మంచిర్యాల 17, మెదక్ 5, మేడ్చల్ 39, ములుగు 5, నాగర్ కర్నూల్ 6, నల్గొండ 6, నారాయణపేట 0, నిర్మల్ 3, నిజామాబాద్ 6, పెద్దపల్లి 9, రాజన్న సిరిసిల్ల 3, రంగారెడ్డి 43, సంగారెడ్డి 16, సిద్ధిపేట 6, సూర్యాపేట 8, వికారాబాద్ 6, వనపర్తి 5, వరంగల్ రూరల్ 6, వరంగల్ అర్బన్ 31, యదాద్రి భువనగిరిలో 6 కేసులు నమోదయ్యాయి.

Also Read:

తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండుగ శుభవార్త.. ప్రత్యేక రైళ్లు పొడిగింపు.. పూర్తి వివరాలివే..!

వైఎస్సార్ రైతు భరోసా డబ్బు జమ కాలేదా.? అయితే ఈ నెంబర్‌కు కాల్ చేయండి.!

ట్యాక్స్ పేయర్స్‌కు గుడ్ న్యూస్.. మరోసారి ఐటీ రిటర్న్స్ గడువు పొడిగింపు

ఏపీ ప్రజలకు ఆర్టీసీ ఓ గుడ్ న్యూస్.. మరో బ్యాడ్ న్యూస్.. అదేంటంటే.!