ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఒక్క రోజులో ఎన్నంటే.!
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,597 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,54,146కు చేరింది.
Coronavirus Positive Cases In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,597 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,54,146కు చేరింది. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 93 మంది మరణించగా.. మృతుల సంఖ్య 2,296కు చేరింది. గడిచిన 24 గంటల్లో 6,676 మంది కరోనాను జయించగా.. కోలుకున్న వారి సంఖ్య 1,61,425కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 26,49,767 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 90,425 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 781, చిత్తూరులో 1235, తూర్పు గోదావరిలో 1332, గుంటూరులో 762, కడపలో 364, కృష్ణాలో 335, కర్నూలులో 781, నెల్లూరులో 723, ప్రకాశంలో 454, శ్రీకాకుళంలో 511, విశాఖలో 797, విజయనగరంలో 593, పశ్చిమ గోదావరిలో 929 కేసులు నమోదయ్యాయి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2461, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 434 కేసులు నమోదయ్యాయి.
Also Read: గ్రామ సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల తేదీలు ఖరారు.!
#COVIDUpdates: 12/08/2020, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2,51,251 పాజిటివ్ కేసు లకు గాను *1,58,530 మంది డిశ్చార్జ్ కాగా *2,296 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 90,425#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/tt4I9ovOHI
— ArogyaAndhra (@ArogyaAndhra) August 12, 2020