Corona Andhra: ఏపీలో కరోనా కల్లోలం.. గడిచిన 24 గంటల్లో 37 మంది మృతి..
Corona Andhra: ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1935 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. వీటిల్లో రాష్ట్రానికి చెందినవి 1919 కేసులు కాగా, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చినవారిలో 16 మందికి కరోనా తేలింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 31,103కి చేరింది. కోవిడ్ కారణంగా గడిచిన 24 గంటల్లో అనంతపురంలో ఆరుగురు, కర్నూలులో నలుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, […]
Corona Andhra: ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1935 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. వీటిల్లో రాష్ట్రానికి చెందినవి 1919 కేసులు కాగా, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చినవారిలో 16 మందికి కరోనా తేలింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 31,103కి చేరింది.
కోవిడ్ కారణంగా గడిచిన 24 గంటల్లో అనంతపురంలో ఆరుగురు, కర్నూలులో నలుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, కడపలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒక్కరు, విశాఖపట్నంలో ఒక్కరు, విజయనగరంలో ఒకరు మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 365కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 16,464కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 14,274 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కొవిడ్ మొదలైనప్పటి నుంచి ఇవాళ్టి వరకు 11,73,096 సాంపిల్స్ పరీక్షించినట్లు అధికారులు తెలిపారు.
Also Read:
జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం.!
ఏపీ ప్రజలకు బ్యాడ్ న్యూస్.. ఆ రూట్లలో బస్సు సర్వీసులు నిలిచిపోయినట్లే.!
విద్యార్ధులకు ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఏపీ: ఆగష్టు 3 నుంచి ఇంటర్ కళాశాలల రీ-ఓపెన్.. 196 పనిదినాలు..!