కరోనా అప్డేట్: ఏపీలో కొత్తగా 657 పాజిటివ్ కేసులు..
ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 28,239 మంది నమూనాలు పరీక్షించగా 657 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. వీటిల్లో రాష్ట్రానికి చెందినవి 611 కేసులు కాగా, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చినవారిలో 46 మందికి కరోనా తేలింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 15,252కి చేరింది. కోవిడ్ కారణంగా గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలులో ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో […]
ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 28,239 మంది నమూనాలు పరీక్షించగా 657 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. వీటిల్లో రాష్ట్రానికి చెందినవి 611 కేసులు కాగా, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చినవారిలో 46 మందికి కరోనా తేలింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 15,252కి చేరింది.
కోవిడ్ కారణంగా గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలులో ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 193కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 6,988కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 8,071 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కొవిడ్ మొదలైనప్పటి నుంచి ఇవాళ్టి వరకు 9,18,429 శాంపిల్స్ పరీక్షించినట్లు అధికారులు తెలిపారు.
#COVIDUpdates: 01/07/2020, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 12,813 పాజిటివ్ కేసు లకు గాను *5587 మంది డిశ్చార్జ్ కాగా *193 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 7,033#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/S3DDSqZSxv
— ArogyaAndhra (@ArogyaAndhra) July 1, 2020