దేశంలో కరోనా @ 67 వేలు, మృతులు 2206…
దేశంలో కరోనా ఉధృత్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 67152 కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అందులో 44029 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. 20916 మంది కోలుకున్నారని వెల్లడించింది. అటు మరణాల సంఖ్య 2206కి చేరినట్లు తెలిపింది. ఇక మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, యూపీలలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. (కొంపముంచిన బర్త్ డే పార్టీ.. ఏకంగా […]
దేశంలో కరోనా ఉధృత్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 67152 కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అందులో 44029 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. 20916 మంది కోలుకున్నారని వెల్లడించింది. అటు మరణాల సంఖ్య 2206కి చేరినట్లు తెలిపింది. ఇక మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, యూపీలలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. (కొంపముంచిన బర్త్ డే పార్టీ.. ఏకంగా 45 మందికి కరోనా.. హైదరాబాద్లో టెన్షన్..)
తాజా సమాచారం ప్రకారం ఏపీ-1980, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ – 33, అరుణాచల్ ప్రదేశ్ – 1, అస్సాం – 63, బీహార్ – 696, ఛండీగర్-169, ఛత్తీస్ఘడ్-59, దాదర్ నగర్ హవేలీ- 1, ఢిల్లీ-6923, గోవా-7, గుజరాత్-8194, హర్యానా-703, హిమాచల్ప్రదేశ్-55, జమ్ముకశ్మీర్-861, జార్ఖండ్ – 157, కర్ణాటక- 848, కేరళ-512, లడాక్-42, మధ్యప్రదేశ్-3614, మహారాష్ట్ర-22171, మణిపూర్-2, మిజోరం- 1, మేఘాలయా- 13, నాగాలాండ్- 0, ఒడిశా – 377, పుదుచ్చేరి -9, పంజాబ్-1823, రాజస్థాన్-3814, తమిళనాడు-7204, తెలంగాణ-1196, త్రిపుర – 150, ఉత్తరాఖండ్ – 68, యూపీ-3467, పశ్చిమ బెంగాల్-1939 కేసులు ఉన్నాయి. అటు కరోనా మరణాలు అత్యధికంగా మహారాష్ట్ర(832)లో సంభవించగా.. ఆ తర్వాత గుజరాత్(493), మధ్యప్రదేశ్(215), వెస్ట్ బెంగాల్(185), రాజస్తాన్(107)రాష్ట్రాలు ఉన్నాయి.
Read More: