కరోనా టైమ్.. విదేశాల్లో తనయుడు.. బెంగలో స్టార్ హీరో..!
ప్రపంచం మొత్తాన్ని కరోనా వణికిస్తోంది. మందులేని ఈ మహమ్మారికి అడ్డు వేసేందుకు ఇప్పటికే పలు దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో దేశాల మధ్య రాకపోకలు కూడా నిలిచిపోగా..
ప్రపంచం మొత్తాన్ని కరోనా వణికిస్తోంది. మందులేని ఈ మహమ్మారికి అడ్డు వేసేందుకు ఇప్పటికే పలు దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో దేశాల మధ్య రాకపోకలు కూడా నిలిచిపోగా.. భారత్కు చెందిన చాలా మంది విదేశాల్లో చిక్కుకుపోయారు. ఈ క్రమంలో తమిళనాడు స్టార్ హీరో విజయ్ కుమారుడు కెనడాలో నిలిచిపోయారు. కెనడాలో ఫిల్మ్స్కు సంబంధించిన విద్యను అభ్యసిస్తోన్న విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ ప్రస్తుతం అక్కడే ఉన్నారు. దీంతో విజయ్ బెంగలో ఉన్నట్లు.. సన్నిహితుల ద్వారా తెలిసింది. తన కుమారుడి గురించి క్షణక్షణం వివరాలు తెలుసుకుంటున్న విజయ్.. సంజయ్ను బాగా మిస్ అవుతున్నారని కోలీవుడ్ టాక్.
కాగా కెనడాలో కోవిడ్ కేసులు పెద్దగా నమోదు కాలేదు. కరోనాపై ముందే అప్రమత్తమైన ఆ దేశం.. వైరస్ను అడ్డుకునేందుకు ముందుస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో కుమారుడు విషయంలో ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదని విజయ్కు సన్నిహితులు సర్దిచెబుతున్నట్లు తెలుస్తోంది. కాగా సినిమాలపై ఆసక్తిని కలిగిన సంజయ్.. ఇప్పటికే కొన్ని లఘు చిత్రాలను తెరకెక్కించడంతో పాటు అందులో నటించారు. కాగా విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్, విజయ్ కుమారుడు సంజయ్ ఇద్దరితో కలిసి శంకర్ ఓ మల్టీస్టారర్ను ప్లాన్ చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Read This Story Also: లాక్డౌన్ ఎఫెక్ట్: సినిమాల విషయంలో పవన్ సంచలన నిర్ణయం..!