కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్ @ జూన్.. బీసీసీఐకు కోట్లలో నష్టం.!
Coronavirus Outbreak: భారత్లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్ను ఏప్రిల్ 15 వరకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా ఈ లీగ్ జరుగుతుందా లేదా అన్న దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ టోర్నమెంట్ను ప్రారంభించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఫ్రాంచైజీల ముందు మూడు ప్లాన్స్ను ఉంచినట్లు తెలుస్తోంది. మొదటిగా ఏప్రిల్ 15 తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి తగ్గితే కొన్ని మ్యాచులు […]
Coronavirus Outbreak: భారత్లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్ను ఏప్రిల్ 15 వరకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా ఈ లీగ్ జరుగుతుందా లేదా అన్న దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ టోర్నమెంట్ను ప్రారంభించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఫ్రాంచైజీల ముందు మూడు ప్లాన్స్ను ఉంచినట్లు తెలుస్తోంది.
మొదటిగా ఏప్రిల్ 15 తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి తగ్గితే కొన్ని మ్యాచులు నిర్వహించి.. ఆ తర్వాత మిగిలిన వాటిని జూన్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఆ తర్వాత రెండవది టోర్నమెంట్ను పూర్తిగా తగ్గించి మ్యాచులను కుదించి ఎలాగైనా ఐపీఎల్ ఏప్రిల్- మేలలో పూర్తి చేయాలని చూస్తున్నారు. చివరిగా మూడోవది దాదాపు కాంట్రాక్టులను రద్దు చేసి ఐపీఎల్ను ఆపేయాలని యోచిస్తున్నారు. కాగా, ఈ మూడు ఆప్షన్లలో బీసీసీఐ దేనిని అమలు చేసిన నష్టం వస్తుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
- మొదటి ఆప్షన్లో నష్టం తక్కువే జరిగినా.. స్పాన్సర్షిప్, బ్రాడ్కాస్టింగ్, ఎడ్వర్టైజింగ్ రెవిన్యూకు గండి పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలుస్తోంది. బీసీసీఐ, ఫ్రాంచైజీలు, క్రికెటర్లు, మ్యాచ్ ఆఫీషియల్స్, ఇతరులకు ఈ నష్టం వాటిల్లుతుందని అంచనా.
- రెండోది జరిగితే మాత్రం నష్టం సుమారు 90 శాతం జరుగుతుందని విశ్లేషిస్తున్నారు.. బీసీసీఐ ఖజానాకు దెబ్బపడింది. బ్రాడ్కాస్టింగ్, స్పాన్సర్షిప్ రైట్స్ ముందుగానే అమ్ముడైపోవడంతో.. వాళ్లు తిరిగి డబ్బులను అడిగే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ట్రావెల్, హోటల్స్ ఇండస్ట్రీ భారీగా పతనం అవుతుంది.
- చివరి ఆప్షన్ను ఎంచుకుంటే అందరికీ నష్టమే జరుగుతుంది. కాంట్రాక్టులు రద్దు కావడం.. టోర్నమెంట్ జరగకపోవడంతో అందరూ కూడా నిరుత్సాహంతో ఇళ్లకు చేరుకోవాలి.
For More News:
కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్కు మిగిలింది 30 రోజులు మాత్రమే
కరోనా ఎఫెక్ట్.. రసికప్రియులకు గుడ్ న్యూస్…
ఫ్లాష్ న్యూస్: కరోనా ప్రభావం.. సీబీఎస్ఈ, జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా..
Breaking: తెలంగాణలో ఒక్క రోజులోనే 8 కరోనా పాజిటివ్ కేసులు..
కరోనా ఎఫెక్ట్.. ఒకేసారి ఆరు నెలల రేషన్ సరుకులు…
Breaking: ఏపీలో రెండో కరోనా పాజిటివ్ కేసు..
కరోనా భయం.. తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు వేల కోళ్లు సజీవ సమాధి..
కరోనా అలెర్ట్.. ఏపీ, తెలంగాణలకు ప్రత్యేక నోడల్ అధికారులు..
ఫ్లాష్: సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలు వాయిదా.. త్వరలోనే కొత్త తేదీలు ప్రకటన