కరోనా రాదని ఉమ్మెత్త గింజలు తిన్నారు.. చివరకు!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు సొంత చిట్కాలు పాటించకండి అంటూ వైద్యులు, నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నా కొంతమంది మారడం లేదు.

కరోనా రాదని ఉమ్మెత్త గింజలు తిన్నారు.. చివరకు!
Follow us

| Edited By:

Updated on: Apr 07, 2020 | 2:35 PM

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు సొంత చిట్కాలు పాటించకండి అంటూ వైద్యులు, నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నా కొంతమంది మారడం లేదు. ఇవి తింటే కరోనా రాదు.. అవి తింటే కరోనా రాదు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలను పాటించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా కరోనా రాదని ఉమ్మెత్త గింజలను తిన్న రెండు కుటుంబాల సభ్యులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. బైరెడ్డిపల్లి మండలం ఆళ్లపల్లికి చెందిన రెండు కుటుంబాలు.. టిక్‌టాక్‌లో ఓ వీడియో చూశారు. అందులో ఉమ్మెత్త గింజలు తింటే కరోనా రాదని చెప్పగా అలాగే చేశారు. దాంతో మొత్తం 11 మందిని అస్వస్థతకు గురయ్యారు. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. టిక్‌టాక్‌ వీడియో చూసి తాము ఉమ్మెత్త గింజలు తిన్నామని బాధితులు చెబుతున్నారు.

Read This Story Also: ప్రభాస్ ఫ్యాన్స్‌ గరం గరం.. స్పందించిన నిర్మాణ సంస్థ