ముంబయిలో కండోమ్స్, హైదరాబాద్లో ఐ-పిల్.. ఎక్కువగా ఆర్డర్ చేసినవే ఇవే..!
లాక్డౌన్ నేపథ్యంలో బయటకు రావడానికి వీల్లేకుండా పోయింది. నిత్యావసర సరుకులు, కూరగాయల కోసం మాత్రమే ప్రజలను బయటకు అనుమతినిస్తున్నారు
లాక్డౌన్ నేపథ్యంలో బయటకు రావడానికి వీల్లేకుండా పోయింది. నిత్యావసర సరుకులు, కూరగాయల కోసం మాత్రమే ప్రజలను బయటకు అనుమతినిస్తున్నారు. అందుకోసం కూడా కొన్ని గంటల సమయం మాత్రమే గడువు పెడుతున్నారు. అయితే ఈ లాక్డౌన్ నేపథ్యంలో కండోమ్స్, ప్రెగ్నేన్సీ కిట్ లాంటి.. కొన్ని వస్తువులు బయట దొరకడం లేదు. దీంతో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ముంబయిలోని ప్రజలు ఎక్కువగా కండోమ్స్, హైదరాబాద్లోని ప్రజలు ఎక్కువగా ఐ-పిల్లను ఆర్డర్ చేశారు. ఈ వివరాలను ప్రముఖ డంజో యాప్ బయటపెట్టింది.
ఈ నెల 14న జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని లాక్డౌన్ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లాక్డౌన్ నేపథ్యంలో వివిధ ప్రదేశాల్లోని ప్రజలు ఏఏ వస్తువులు ఎక్కువగా ఆర్డర్ చేశారో.. వాటికి సంబంధించి వివరాలను డంజో యాప్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వివరాల ప్రకారం.. బెంగళూరు, పుణెలో ప్రెగ్నెన్సీ కిట్.. చెన్నై, జైపూర్లో హ్యాండ్ వాష్, ముంబయిలో కండోమ్స్, హైదరాబాద్లోని ప్రజలు ఐ-పిల్ను ఎక్కువగా ఆర్డర్ చేసినట్లు వెల్లడించారు. అందులో చెన్నై, జైపూర్ ప్రజలు ఆరోగ్యం మీద శ్రద్ధ చూపగా.. మిగిలిన వారు సామాజిక దూరాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా ‘రక్షణ’, ప్రెగ్నెన్సీ కిట్, ఐ పిల్ లాంటి వస్తువులు ఆర్డర్ చేయడం గమనర్హం.
Read This Story Also: సినిమాలో రామ్ చరణ్ తెలుసా..? కేటీఆర్ వీడియో వైరల్..!
Some Indian cities med the most of it during the lockdown, this March. Delivering from pharmacies is clearly no child's play.?#Contraceptives #Condoms #PregancyKits #HandWash #IPill #Pharmacies #Medicines #Lockdown2020 #quarantinelife #quarantineandchill pic.twitter.com/6fEvKMJniC
— Dunzo (@DunzoIt) April 14, 2020