ఛానెల్స్పై పిటిషన్ వేయాలనుందన్న అశ్విన్ భార్య.. ఎందుకంటే..!
టీవీ ఛానెల్స్పై పిటిషన్ వేయాలనుందని టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భార్య ప్రీతి సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
టీవీ ఛానెల్స్పై పిటిషన్ వేయాలనుందని టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భార్య ప్రీతి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 రోజులు పాటు లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దూరదర్శన్లో ఒకప్పుడు ప్రసారం అయిన రామాయణం, మహాభారతం ధారావాహికలను రీ టెలికాస్ట్ చేస్తున్నారు. త్వరలో మరికొన్నింటిని ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తనకు నచ్చిన సినిమాలను వేసే విధంగా ఛానెల్స్పై పిటిసన్ వేయాలనుందని ప్రీతి సోషల్ మీడియాలో సరదాగా ట్వీట్ చేశారు. అంతేకాదు ఏఏ సమయాల్లో ఎలాంటి సినిమాలు వేయాలో కూడా ఆమె పేర్కొన్నారు.
కామెడీ, మసాలా సినిమాలను ఉదయం గం.9.30లకు, ఫీల్గుడ్ సినిమాలను మధ్యాహ్నం గం.3లకు వేయాలని ఆమె చెప్పారు. అంతేకాదు ఉదయం పూట సినిమాల సమయంలో వాణిజ్య ప్రకటనలు ఎక్కువగా ఉండేలా చూడమని ఆమె కోరారు. అందుకు ఆమె ఓ కారణం కూడా చెప్పారు. అదేంటంటే ఆ మధ్యలో వంట వండుకోవాలట. ఇక మధ్యాహ్నం ప్రసారం అయ్యే మూవీలకు అస్సలు బ్రేక్ ఉండొద్దని ప్రీతి తెలిపింది. ఇక ఈ ట్వీట్కు స్పందించిన అశ్విన్.. రిటర్న్ ఆఫ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అయితే ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు.
Read This Story Also: టోక్యో ఒలింపిక్స్ రీషెడ్యూల్.. కొత్త తేదీలు ఇవే..!