ఆ విషయంలో కరోనావైరసే బెటర్

కరోనా పిశాచం ప్రపంచదేశాలను వణికిస్తోంది… ఆ మహమ్మారి బారిన పడి ఇప్పటికే చైనాలో వందలాది మంది మరణించారు.. వేలాది మంది బాధపడుతున్నారు..కొందరు అంతిమఘడియలను లెక్కపెట్టుకుంటున్నారు.. అడ్డదిడ్డమైన వైరస్‌లను పుట్టించడం… వాటిని ప్రపంచదేశాలమీద వదిలేయడం చైనావోడికి బాగా అలవాటైందని తిట్టుకుంటున్నాం కానీ.. ఇంతకంటే డేంజర్‌ వైరస్‌లు చాలానే ఉన్నాయి.. అంతెందుకు ఈ మధ్యనే అమెరికాలో ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ వేలాది మంది ప్రాణాలను బలితీసుకుంది… ఇందులో ఓ 60 మంది చిన్నారులున్నారు. ఓ పదిహేను లక్షల మందిని ఈ ఇన్‌ఫ్లుయెంజా […]

ఆ విషయంలో కరోనావైరసే బెటర్
Follow us

| Edited By: Srinu

Updated on: Feb 01, 2020 | 4:42 PM

కరోనా పిశాచం ప్రపంచదేశాలను వణికిస్తోంది… ఆ మహమ్మారి బారిన పడి ఇప్పటికే చైనాలో వందలాది మంది మరణించారు.. వేలాది మంది బాధపడుతున్నారు..కొందరు అంతిమఘడియలను లెక్కపెట్టుకుంటున్నారు.. అడ్డదిడ్డమైన వైరస్‌లను పుట్టించడం… వాటిని ప్రపంచదేశాలమీద వదిలేయడం చైనావోడికి బాగా అలవాటైందని తిట్టుకుంటున్నాం కానీ.. ఇంతకంటే డేంజర్‌ వైరస్‌లు చాలానే ఉన్నాయి.. అంతెందుకు ఈ మధ్యనే అమెరికాలో ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ వేలాది మంది ప్రాణాలను బలితీసుకుంది… ఇందులో ఓ 60 మంది చిన్నారులున్నారు. ఓ పదిహేను లక్షల మందిని ఈ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ పట్టి పీడించిందట! దీన్నే హెచ్‌1 ఎన్‌1 అంటారు.. లక్షన్నరమంది ప్రాణం మీదతీపితో ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారట!

ఇదేదో అమెరికా అంటే పడనివాళ్లు చెప్పిన మాట కాదు.. సాక్షాత్తు అమెరికాలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ అండ్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌ చెప్పిన సత్యం…అంతమంది ప్రాణాలను తీసుకున్నా ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ ఇంకా దాహం తీరలేదు.. మరిన్ని ప్రాణాలు తీసేందుకు సిద్ధమవుతున్నది… ఇప్పుడీ కరోనా ఒకటి దానికి తోడైంది… ఈ రెండూ కలిస్తే పరిస్థితి బీభత్స భయానకమే!

చాలా విషయాలను అమెరికా బయటకు పొక్కనివ్వకుండా దాచేస్తుంది… అగ్రరాజ్యం పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం కాబట్టి ఇలాంటివి అస్సలు బయటపడనివ్వదు.. అమెరికాలో రోగాలు రొచ్చులు ఉండవనుకుంటాం కానీ అక్కడా ఉంటాయి.. అమెరికా జనానికి ఈ ఫ్లూ వైరస్‌ కొత్తేమీ కాదు.. వైరస్‌ దెబ్బను అనుభవించింది.. అల్లాడిపోయింది.. ఏటా కొన్ని వేల మంది ప్రాణాలను ఈ వైరస్‌ అవలీలగా మింగేస్తుంటుంది.. అమెరికా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం.. మెడికల్‌ క్యాంపులు పెట్టడం వల్ల కేసుల సంఖ్య కాసింత తగ్గింది..

2017-18లో అయితే నాలుగున్నర కోట్ల మంది ఫ్లూ జ్వరంతో నరకయాతన అనుభవించారు.. ఇందులో 61 వేల మంది చనిపోయారు.. లాస్ట్‌ సీజన్‌లో కోటి 70 లక్షల మంది ఫ్లూ బారిన పడి మందులు మాకులు మింగారు.. అవి కూడా పని చేయక ఓ 34 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ చెబుతున్నదేమిటంటే అక్కడ సంవత్సరానికి 12 వేల నుంచి 64 వేల మంది ఫ్లూ వైరస్‌తో చనిపోతున్నారు.. ప్రపంచవ్యాప్తంగా ఆరున్నర లక్షల మంది హరీమంటున్నారన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలేసి మరీ చెబుతోంది.. ఈ లెక్కన కరోనా వైరస్‌ ఏపాటిది..?

జనరల్‌గా చాలామంది ఫ్లూను లైట్‌ తీసుకుంటారు.. ఫ్లూనే కదా అని నెగ్లెట్‌ చేస్తారు.. ఫ్లూ సోకడం.. దాంతో పాటు మరో ఇన్‌ఫెక్షన్‌ రావడం అంటూ జరిగిందా..? అంతే ..! ప్రాణాలు కాపాడుకోవడం చాలా కష్టం.. న్యూమోనియా రావచ్చు.. మెదడువాపు వ్యాధి రావచ్చు…మరేదైనా జరగొచ్చు… కొనిసందర్భాలలో శరీరంలోని అవయవాలు పనిచేయడం మానేయనూ వచ్చు.. అప్పుడా రోగి పడే అవస్థల కంటే ప్రాణం పోవడమే మంచిదనిపిస్తుంది…హెచ్‌1 ఎన్‌1 వైరస్‌ను అంతం చేసే మందే లేదా..? అంటే ఉంది కానీ.. ఆ వైరస్‌ ఎప్పటికప్పుడు తనను తాను మార్చేసుకుంటూ వస్తోంది.. ఏడాదికేడాది బలోపేతం అవుతూ వస్తోంది… అందుకే ఎప్పటికప్పుడు మందులను అప్‌గ్రేడ్‌ చేసుకురావలసి వస్తోంది… ఇప్పుడనిపిస్తుంది కదూ.. కరోనానే కాసింత బెటరని..!

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు