ట్రోపీలు అమ్మి కరోనాకు నిధులు.. ఆదర్శంగా నిలిచిన యంగ్ గోల్ఫ్ ప్లేయర్..!
కరోనాపై ప్రభుత్వాలు చేస్తోన్న పోరుకు తన వంతు ఆర్థిక సాయం అందించారు ఇండియన్ యంగ్ గోల్ఫ్ ప్లేయర్ అర్జున్ భాటి. గత ఎనిమిదేళ్లలో తాను సాధించిన 102 ట్రోఫీలను విక్రయించి..
కరోనాపై ప్రభుత్వాలు చేస్తోన్న పోరుకు తన వంతు ఆర్థిక సాయం అందించారు ఇండియన్ యంగ్ గోల్ఫ్ ప్లేయర్ అర్జున్ భాటి. గత ఎనిమిదేళ్లలో తాను సాధించిన 102 ట్రోఫీలను విక్రయించి.. ఆ విరాళాలను పీఎం కేర్స్కి ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారు. ఆ ట్రోఫీల ద్వారా తనకు రూ.4.30లక్షలు వచ్చాయని.. వాటిని కరోనాపై పోరుకు విరాళంగా ఇచ్చానని అర్జున్ తెలిపారు.
”ప్రస్తుతం దేశం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది. నా తరఫున దేశానికి సాధ్యమైనంత సాయం చేయాలని భావించాను. గత 8ఏళ్లలో నేను సాధించిన 102 ట్రోఫీలను అమ్మి.. వాటి ద్వారా వచ్చిన రూ.4.30 లక్షలను ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చా. వ్యక్తిగతంగా నా దగ్గర డబ్బు లేకపోవడంతో.. ట్రోఫీలు విక్రయించాలని నిర్ణయించుకున్నా. దేశానికి సాయం అవసరమైన సమయంలో ఖాళీగా కూర్చోలేను. ట్రోఫీలను భవిష్యత్తులో కూడా సంపాదించుకోవచ్చు. మహమ్మారిపై మనం విజయం సాధించాలి” అని అర్జున్ తెలిపారు. ఇక ఈ ట్రోఫీలను తన బంధువులు, స్నేహితులు కొన్నారని.. లాక్డౌన్ ముగిసిన తరువాత వీటిని వాళ్లకు అందజేస్తానని ఆయన అన్నారు. కాగా 15 ఏళ్ల వయసున్న అర్జున్.. జూనియర్ స్థాయిలో మూడు ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిళ్లతో పాటు జాతీయ ఛాంపియన్షిప్ను సాధించారు.
Read This Story Also: Coronavirus:కరోనాను అందరికీ అంటిస్తా.. యువతి వీడియో వైరల్..!