Breaking: ఆర్మీకి పాకిన కరోనా.. జవాన్కు పాజిటివ్..!
కరోనా మహమ్మారి తీవ్రత భారత్లో రోజు రోజుకు ఎక్కువవుతోంది. ఈ వ్యాధి బాధితుల సంఖ్య తాజాగా 81కు చేరగా.. ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. వేల సంఖ్యలో కరోనా అనుమానితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు.
కరోనా మహమ్మారి తీవ్రత భారత్లో రోజు రోజుకు ఎక్కువవుతోంది. ఈ వ్యాధి బాధితుల సంఖ్య తాజాగా 81కు చేరగా.. ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. వేల సంఖ్యలో కరోనా అనుమానితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదకర వైరస్ భారత ఆర్మీకి పాకింది. పంజాబ్ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ జవాను కరోనా లక్షణాలతో బాధపడుతుండగా.. ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు ఆయనకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో మెరుగైన వైద్యం కోసం జవాన్ను ఐసోలేషన్ సెంటర్కు తరలించారు. కాగా ఈ జవాను ఇటీవల ఇటలీ పర్యటనకు వెళ్లి వచ్చినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఇటలీ పర్యటనకు వెళ్లిన ఈ జవాన్.. మార్చి 11న మానేసర్లోని ఆర్మీ క్యాంపుకు వచ్చారని, కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించామని ఆర్మీ అధికారులు వెల్లడించారు. కాగా కరోనాపై భయపడాల్సిన అవసరం లేదని, ముందస్తు జాగ్రత్తల వల్లన కరోనాను జయించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
Read This Story Also: సల్మాన్తో అవకాశం.. పూజా షాకింగ్ డెసిషన్..!