ఏపీని వణికిస్తున్న కరోనా.. 5 వేలు దాటిన మరణాలు..
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి చాప కింద నీరులా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 70,511 శాంపిల్స్ టెస్టు చేయగా.. అందులో 8846 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Coronavirus Death Toll In Andhra Pradesh: ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి చాప కింద నీరులా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 70,511 శాంపిల్స్ టెస్టు చేయగా.. అందులో 8846 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 5,83,925కి చేరింది. వీటిల్లో 92,353 యాక్టివ్ కేసులు ఉండగా.. 4,86,531 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 5041కి చేరుకుంది.
అటు గడిచిన 24 గంటల్లో 9628 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. 69 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. నిన్న ఒక్క రోజే తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1423 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ప్రకాశంలో 979, పశ్చిమగోదావరిలో 955 కేసులు నమోదయ్యాయి. ఇక అనంతపురం 299, చిత్తూర్ 572, గుంటూరు 641, కడప 661, కృష్ణ 398, కర్నూలు 314, నెల్లూరు 820, శ్రీకాకుళం 678, విజయనగరం 532, విశాఖపట్నం 574కేసులు నమోదయ్యాయి. కాగా, తూర్పుగోదావరిలో అత్యధికంగా 79,643 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. చిత్తూరులో 1543 కరోనా మరణాలు సంభవించాయి.
#COVIDUpdates: 15/09/2020, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 5,81,030 పాజిటివ్ కేసు లకు గాను *4,83,636 మంది డిశ్చార్జ్ కాగా *5,041 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 92,353#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/drboBFHxkY
— ArogyaAndhra (@ArogyaAndhra) September 15, 2020
Also Read:
ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!
బిగ్ బాస్ 4: ఈ సీజన్లో ఆమెదే భారీ రెమ్యునరేషన్
‘కరోనా వైరస్ను ల్యాబ్లో తయారు చేశారు.. ఆధారాలు ఉన్నాయి’