ఏపీ: కొత్తగా 8,218 పాజిటివ్ కేసులు, 58 మరణాలు
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8218 పాజిటివ్ కేసులు, 58 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 6,17,776కి చేరింది.
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8218 పాజిటివ్ కేసులు, 58 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 6,17,776కి చేరింది. వీటిల్లో 81,763 యాక్టివ్ కేసులు ఉండగా.. 5,30,711 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 5302కి చేరుకుంది. (Coronavirus In Andhra Pradesh)
అటు గడిచిన 24 గంటల్లో 10,820 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్క రోజే తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1395 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పశ్చిమగోదావరిలో 1071 కేసులు నమోదయ్యాయి. ఇక అనంతపురం 477, చిత్తూర్ 736, గుంటూరు 471, కడప 520, కృష్ణ 468, కర్నూలు 319, నెల్లూరు 693, శ్రీకాకుళం 485, విజయనగరం 462, ప్రకాశంలో 670, విశాఖపట్నం 451 కేసులు నమోదయ్యాయి. కాగా, తూర్పుగోదావరిలో అత్యధికంగా 85,247 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. చిత్తూరులో 580 కరోనా మరణాలు సంభవించాయి.
#COVIDUpdates: 19/09/2020, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 6,14,881పాజిటివ్ కేసు లకు గాను *5,27,816 మంది డిశ్చార్జ్ కాగా *5,302 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 81,763#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/CT9RjBRocB
— ArogyaAndhra (@ArogyaAndhra) September 19, 2020