ఏపీ: 8,835 పాజిటివ్ కేసులు, 64 మరణాలు..
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 75,013 శాంపిల్స్ టెస్టు చేయగా.. అందులో 8835 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Coronavirus Death Toll In Andhra Pradesh: ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 75,013 శాంపిల్స్ టెస్టు చేయగా.. అందులో 8835 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 5,92,760కి చేరింది. వీటిల్లో 90,279 యాక్టివ్ కేసులు ఉండగా.. 4,97,376 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 5105కి చేరుకుంది.
అటు గడిచిన 24 గంటల్లో 10,845 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. 64 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. నిన్న ఒక్క రోజే తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1421 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పశ్చిమగోదావరిలో 1051, ప్రకాశంలో 873 కేసులు నమోదయ్యాయి. ఇక అనంతపురం 725, చిత్తూర్ 798, గుంటూరు 685, కడప 536, కృష్ణ 396, కర్నూలు 424, నెల్లూరు 562, శ్రీకాకుళం 495, విజయనగరం 544, విశాఖపట్నం 325 కేసులు నమోదయ్యాయి. కాగా, తూర్పుగోదావరిలో అత్యధికంగా 81,064 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. చిత్తూరులో 552 కరోనా మరణాలు సంభవించాయి.
Also Read:
ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!
అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!
బిగ్ బాస్ 4: ఈ సీజన్లో ఆమెదే భారీ రెమ్యునరేషన్
కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.!