కరోనాతో సహజీవనం చేయాల్సిందే: కాన్ఫరెన్స్లో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
లాక్డౌన్ నుంచి దేశ ప్రజలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వాలి? ఏఏ రంగాలకు ప్రత్యేక ప్యాకేజీ అవసరం అన్న విషయంపై అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చిస్తున్నారు ప్రధాని మంద్రి నరేంద్ర మోదీ. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు..
లాక్డౌన్ నుంచి దేశ ప్రజలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వాలి? ఏఏ రంగాలకు ప్రత్యేక ప్యాకేజీ అవసరం అన్న విషయంపై అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చిస్తున్నారు ప్రధాని మంద్రి నరేంద్ర మోదీ. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మాలా సీతా రామన్ హాజరయ్యారు. ప్రధాని ప్రసంగం తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
కరోనాతో మనం సహజీవనం చేయాల్సిందేనన్నారు జగన్. వ్యాక్సిన్ కనుగొనే వరకూ కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంటుందన్నారు. ఈ వైరస్పై దేశ ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని.. ప్రధాని మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో స్పష్టం చేశారు సీఎం జగన్.
కాగా ఈ వీడియో కాన్ఫరెన్స్లో అనేక రాష్ట్రాలు తమ తమ డిమాండ్లను కేంద్రం ముందు పెట్టాయి. రాష్ట్రాల సీఎంలతో లాక్డౌన్ తర్వాత ప్రధాని మోదీ సమావేశం కావడం ఇది ఐదవ సారి. అయితే ప్రధాని మోదీ విధించి లాక్డౌన్ మే 17వ తేదీ ముగియనుంది. దానికి ఇంకా ఆరు రోజుల సమయం ఉండగానే మోదీ.. అన్ని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడటంతో తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మే 17వ తేదీ తర్వాత లాక్డౌన్ కొనసాగిస్తారా? లేదా? అనేది మరికొద్దిసమయంలో తేలనుంది.
Read More: