ర్యాపిడ్ కిట్లతో కరోనా పరీక్ష చేయించుకున్న సీఎం జగన్..!
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు కరోనా పరీక్ష చేయించుకున్నారు. దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ఇవాళ రాష్ట్రానికి వచ్చిన విషయం తెలిసిందే.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు కరోనా పరీక్ష చేయించుకున్నారు. దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ఇవాళ రాష్ట్రానికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కిట్లను ఉపయోగించి వైద్య సిబ్బంది జగన్కు కరోనా పరీక్ష చేశారు. ఫలితాల్లో ఆయనకు నెగిటివ్గా నిర్ధారణ అయ్యింది. కాగా ఈ ర్యాపిడ్ టెస్టు కిట్ల ద్వారా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఫలితాలను తెలుసుకోవచ్చు. ర్యాపిడ్ కిట్లలో ఐజీజీ, ఐజీఎం రెండురకాలు స్ట్రిప్స్ ఉంటాయి. కేవలం బ్లడ్ డ్రాప్స్ను ఈ స్ట్రిప్స్పై వేసి.. ఆ తరువాత కంట్రోల్ సొల్యూషన్ వేస్తారు. 10 నిమిషాల వ్యవధిలోనే శరీరంలో వైరస్ ఉన్నదీ, లేనిదీ చూపిస్తుంది. దక్షిణ కొరియాకు చెందిన ఎస్డీ బయోసెన్సార్ కంపెనీ వీటిని ఉత్పత్తి చేస్తోంది. ఐసీఎంఆర్ కూడా ఇప్పటికే ఈ కిట్లకు ఆమోదం తెలిపింది. ఈ టెస్టు కిట్లను సియోల్ నుంచి ప్రత్యేక చార్టర్ విమానం ద్వారా ఏపీకి తీసుకొచ్చారు. 4 నుంచి 5 రోజుల్లో అన్ని జిల్లాలకు ఈ ర్యాపిడ్ టెస్టు కిట్లను పంపిణీ చేయనున్నారు.
Read This Story Also: ‘గచ్చిబౌలి క్వారంటైన్ సెంటర్’కు ఆ ప్రముఖ సంస్థ భారీ సాయం..!