ఇండియాకు ఇంకా తిరిగిరాని జ్యోతి.. కుటుంబసభ్యుల ఆందోళన..
Corona Virus Out Break: చైనాలోని వూహన్ నగరంలో చిక్కుకున్న తెలుగమ్మాయి జ్యోతిని తిరిగి తీసుకురావాలని ఆమె తల్లిదండ్రులు కేంద్రాన్ని వేడుకుంటున్నారు. ఈ మేరకు తాజాగా ఢిల్లీలోని హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన జ్యోతి కుటుంబసభ్యులు తమ గోడును వినిపించారు. ఈ నెల 14న జ్యోతి వివాహం జరగనుండగా.. వీలైనంత త్వరగా తమ కుమార్తెను స్వస్ధలానికి రప్పించేందుకు చర్యలు చేపట్టాలని వారు కోరుకుంటున్నారు. ప్రాణాంతక కరోనా వైరస్తో విలవిల్లాడుతున్న వూహన్ నగరంలో తమ కూతురు చిక్కుకుపోవడం మరింత […]
Corona Virus Out Break: చైనాలోని వూహన్ నగరంలో చిక్కుకున్న తెలుగమ్మాయి జ్యోతిని తిరిగి తీసుకురావాలని ఆమె తల్లిదండ్రులు కేంద్రాన్ని వేడుకుంటున్నారు. ఈ మేరకు తాజాగా ఢిల్లీలోని హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన జ్యోతి కుటుంబసభ్యులు తమ గోడును వినిపించారు. ఈ నెల 14న జ్యోతి వివాహం జరగనుండగా.. వీలైనంత త్వరగా తమ కుమార్తెను స్వస్ధలానికి రప్పించేందుకు చర్యలు చేపట్టాలని వారు కోరుకుంటున్నారు.
ప్రాణాంతక కరోనా వైరస్తో విలవిల్లాడుతున్న వూహన్ నగరంలో తమ కూతురు చిక్కుకుపోవడం మరింత ఆందోళన కలిగిస్తోందని ఆమె కుటుంబసభ్యులు బాధను వ్యక్తం చేశారు. తోటివారంతా భారత్కు తిరిగి వచ్చినా.. ఆమె మాత్రమే అక్కడే మిగిలిపోవడం.. తమతో పాటు తమ కుమార్తెను కూడా మానసికంగా కృంగతీస్తోందని ఆవేదన చెందారు. ప్రస్తుతం భారత్-చైనాల మధ్య విమాన రాకపోకలు నిలిచిపోవడంతో.. జ్యోతి తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. కాగా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్తో కూడా భేటీ అయిన జ్యోతి కుటుంబసభ్యులు.. తమ కుమార్తెను వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించాలని విజ్ఞప్తి చేశారు.