కరోనా వైరస్: నాడే చెప్పిన బ్రహ్మంగారి కాలజ్ఞానం!

కరోనా విజృంభిస్తోంది. అంతకంతకూ వ్యాపిస్తోంది. చైనా నుంచి వ్యాప్తి చెందిన ఈ మహమ్మారి.. ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఇప్పటికే చైనాలో కరోనా బారిన పడి 100 మందికి పైగా చనిపోయారు. వైరస్‌ తీవ్రత కారణంగా చైనా ఆర్థికశాఖ 9 బిలియన్‌ డాలర్లు ప్రకటించింది. మహమ్మారిని తరిమివేసేందుకు నడుంబిగించింది. మరో 2,744 మందికి వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు చైనా ఆరోగ్య సంస్థ గుర్తించింది. వీరిలో 461 మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్.. క్రమేపీ […]

కరోనా వైరస్: నాడే చెప్పిన బ్రహ్మంగారి కాలజ్ఞానం!
Follow us

| Edited By:

Updated on: Jan 28, 2020 | 5:14 PM

కరోనా విజృంభిస్తోంది. అంతకంతకూ వ్యాపిస్తోంది. చైనా నుంచి వ్యాప్తి చెందిన ఈ మహమ్మారి.. ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఇప్పటికే చైనాలో కరోనా బారిన పడి 100 మందికి పైగా చనిపోయారు. వైరస్‌ తీవ్రత కారణంగా చైనా ఆర్థికశాఖ 9 బిలియన్‌ డాలర్లు ప్రకటించింది. మహమ్మారిని తరిమివేసేందుకు నడుంబిగించింది. మరో 2,744 మందికి వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు చైనా ఆరోగ్య సంస్థ గుర్తించింది. వీరిలో 461 మంది పరిస్థితి విషమంగా ఉంది.

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్.. క్రమేపీ ఇండియాలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. చైనాలోని వూహాన్‌లో మొదలైన ఈ వ్యాధి లక్షణాలు.. ఇప్పుడు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. కాగా.. దీంతో భారత ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టింది.

అయితే,  ఇటువంటి సంఘటనలను చూస్తుంటే పోతులూరి వీరబ్రహ్మంగారి  కాలజ్ఞానం గుర్తొస్తోంది. 17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త, దైవ స్వరూపులైన బ్రహ్మం గారు తన కాలజ్ఞానములో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. ప్రస్తుత కరోనా వైరస్ విజృంభణ బ్రహ్మంగారి ఈ పద్యానికి చక్కగా సరిపోతుంది.

ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను లక్షలాది ప్రజలు సచ్చేరయ కోరంకియను జబ్బు కోటిమందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరయ

రాబోయే కాలంలో జరగబోయే విపత్తుల గురించి తన కాలజ్ఞానంలో సుస్పష్టంగా వివరించి, జనులందరిని సన్మార్గంలో నడువమని బోధించిన మహిమాన్వితుడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు.