కోయంబేడు మార్కెట్లో మళ్లీ కరోనా విజృంభణ.. చెన్నైవాసుల్లో ఆందోళన
తమిళనాడులోని చెన్నైలో కరోనా హాట్స్పాట్గా మారిన కోయంబేడ్ మార్కెట్లో కరోనా మహమ్మారి రెండోసారి విజృంభిస్తోంది.
Koyambedu Market Chennai: తమిళనాడులోని చెన్నైలో కరోనా హాట్స్పాట్గా మారిన కోయంబేడ్ మార్కెట్లో కరోనా మహమ్మారి రెండోసారి విజృంభిస్తోంది. ఇటీవల అక్కడి షాపులు తెరుచుకునేందుకు అధికారులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. ఈ క్రమంలో దాదాపుగా అన్ని షాపులు తెరుచుకున్నాయి. దీంతో మార్కెట్కి జనం పోటెత్తారు. ఇక ఈ మార్కెట్లో పనిచేస్తున్న కూలీలకు ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో 54 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అటు చెన్నైవాసులతో పాటు ఇటు అధికారుల్లోనూ ఆందోళన మొదలైంది.
అయితే ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్ యార్డుగా కోయంబేడు మార్కెట్ నడుస్తోంది. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు భారీగా కూరగాయలు, పండ్ల ఎగుమతి దిగుమతులు జరుగుతున్నాయి. కోట్లలో అక్కడ వ్యాపారం జరుగుతుంటుంది. ఇక లాక్డౌన్ మొదలైన తరువాత ఏప్రిల్ నెలలో ఈ మార్కెట్ కరోనాకు హాట్స్పాట్గా మారింది. ఈ మార్కెట్ వలన 3వేల కేసులు నమోదు అయినట్లు అంచనా. అంతేకాదు వారి కాంటాక్ట్ల వలన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా కేసులు పెరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇక ఆ మార్కెట్కు రాకపోకలు జరగడం వలనే ఏపీలో కేసులు పెరిగినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజులు ఈ మార్కెట్ని మూసేశారు. కానీ ఇటీవల ప్రభుత్వ ఆదేశాలతో విడతల వారీగా అక్కడ దుకాణాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమయంలో మళ్లీ అక్కడ కేసులు నమోదవుతుండటం అందరిలో ఆందోళనను కలిగిస్తోంది.
Read More:
Bigg Boss 4: మోనాల్కి ఆరోగ్యం బాలేదా..!
కరెన్సీ నోట్లపై 28 రోజుల పాటు కరోనా వైరస్.. శాస్త్రవేత్తల హెచ్చరిక