Corona Virus: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి సోమిరెడ్డికి కరోనా పాజిటివ్.. ట్విటర్ ద్వారా వెల్లడి..
Corona Virus: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్..
Corona Virus: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. కరోనా వ్యాధికి సంబంధించి స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దాంతో ఆయన హోంక్వారంటైన్లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల వరుసగా ప్రజా కార్యక్రమాలు ఆయన పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కరోనా సోకినట్లు అంతా భావిస్తున్నారు. కాగా, ఈ విషయాన్ని సోమిరెడ్డి ట్విటర్ ద్వారా వెల్లడించారు.
‘‘అందరికీ నమస్కారం. ఈ రోజు నేను కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఆరోగ్యంగానే ఉన్నాను. హోం క్వారంటైన్ లో విశ్రాంతి తీసుకుంటున్నాను. ఇటీవల నన్ను కలిసినవారందరూ తగు జాగ్రత్తలు తీసుకోగలరు’’ అంటూ సోమిరెడ్డి ట్వీట్ చేశారు.
Somireddy Chandra Mohan Reddy Tweet:
అందరికీ నమస్కారం. ఈ రోజు నేను కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఆరోగ్యంగానే ఉన్నాను..హోం క్వారంటైన్ లో విశ్రాంతి తీసుకుంటున్నాను. ఇటీవల నన్ను కలిసినవారందరూ తగు జాగ్రత్తలు తీసుకోగలరు.
— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) January 6, 2021