ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కరోనా పాజిటివ్.. చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిక..
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహ్మమారి తగ్గినట్లే తగ్గుతూ రెచ్చిపోతోంది. తాజాగా ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కరోనా..
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహ్మమారి తగ్గినట్లే తగ్గుతూ రెచ్చిపోతోంది. తాజాగా ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కరోనా బారిన పడ్డారు. కరోనాకు సంబంధించి స్వల్ప లక్షణాలు కనిపించడంతో శ్రీనివాసులు రెడ్డి సంబంధిత టెస్టులు చేయించుకున్నారు. ఈ టెస్టుల ఆధారంగా వైద్యులు ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు. వెంటనే ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆయనను ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, తాను ఆరోగ్యంగానే ఉన్నానని శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. మరోవైపు ఎంపీ శ్రీనివాసులు రెడ్డికి కరోనా అని తెలియడంతో ఆయన అభిమానులు, ఒంగోలు వైసీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనలో వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకుని రావాలని కోరుకుంటున్నారు.
Also read:
ఆంధ్ర ఆదర్శ రైతుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్.. ఒకసారి కలుద్దామంటూ ఆహ్వానం..