బ్రేకింగ్: బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతలకు కరోనా పాజిటివ్
తెలంగాణ బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్గా తేలింది. గత కొన్ని రోజులుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం చింతల ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు బీజేపీ శ్రేణులు. కాగా ప్రస్తుతం ఆయన ఇంటిలోనే విశ్రాంతి...
తెలంగాణ బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్గా తేలింది. గత కొన్ని రోజులుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం చింతల ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు బీజేపీ శ్రేణులు. కాగా ప్రస్తుతం ఆయన ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. మాజీ బీజేపీ ఎమ్మెల్యేకి కరోనా రావడంతో.. ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందరికీ పాజిటివ్ తేలింది. చింతల రామచంద్రరెడ్డి భార్య, కుమారుడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.
కాగా ఆదివారం తెలంగాణలో 199 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. ఐదుగురు ప్రాణాలు విడిచారు. అలాగే ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 2,698 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1428 మంది వ్యాధి నయమై ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,188 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ మొత్తం కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 82కి చేరింది.
ఇది కూడా చదవండి:
ఒకటో తేదీ ఝలక్.. పెరిగిన గ్యాస్ ధరలు..
దేశవ్యాప్తంగా ప్రారంభమైన రైళ్లు.. 4 నెలలకు రిజర్వేషన్..
రైతులకు కేంద్రం అందించే బంపర్ ఆఫర్.. చివరి తేదీ ఇదే!
‘ఆ బడా డైరెక్టర్ బాగోతం బయటపెడతా’.. బిగ్బాస్ నందినీ సంచలన కామెంట్స్