Breaking: ఏపీలో కరోనా టెర్రర్.. వెయ్యికి చేరువైన మరణాలు..

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి చాప కింద నీరులా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 53,681 శాంపిల్స్ టెస్టు చేయగా.. అందులో 7,813 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Breaking: ఏపీలో కరోనా టెర్రర్.. వెయ్యికి చేరువైన మరణాలు..
Follow us

|

Updated on: Jul 25, 2020 | 6:09 PM

Corona Cases In Andhra Pradesh: ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి చాప కింద నీరులా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 53,681 శాంపిల్స్ టెస్టు చేయగా.. అందులో 7,813 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 88,671కి చేరింది. వీటిల్లో 44,431 యాక్టివ్ కేసులు ఉండగా.. 43,255 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 985కి చేరుకుంది.

అటు గడిచిన 24 గంటల్లో 3,208 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. 52 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. నిన్న ఒక్క రోజే తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1324 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పశ్చిమగోదావరిలో 1012, విశాఖపట్నంలో 936 కేసులు నమోదయ్యాయి. ఇక అనంతపురం 723, చిత్తూర్ 300, గుంటూరు 656, కడప 294, కృష్ణ 407, కర్నూలు 742, నెల్లూరు 299, ప్రకాశం 248, శ్రీకాకుళం 349, విజయనగరం 523 కేసులు నమోదయ్యాయి. కాగా, తూర్పుగోదావరిలో అత్యధికంగా 12,391 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. కర్నూలులో 156 కరోనా మరణాలు సంభవించాయి.

Also Read:

కోవిడ్ మరణాలు తగ్గించేందుకు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

బియ్యం కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనా కోసం ప్రత్యేక యాప్..!

‘దిల్ బేచారా’ మూవీ రివ్యూ… కంటతడి పెట్టిన సుశాంత్ యాక్టింగ్..