ఏపీ కరోనా బులిటెన్.. కొత్తగా ఎన్ని కేసులంటే..!
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. తాజగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,004 పాజిటివ్ కేసులు, 91 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,34,771కి చేరింది.
Corona Cases Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. తాజగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,004 పాజిటివ్ కేసులు, 91 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,34,771కి చేరింది. ఇందులో 1,00,276 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,30,526 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో మృతుల సంఖ్య 3969కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. అటు గడిచిన 24 గంటల్లో 8,772 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా.. అత్యధికంగా తూర్పు గోదావరిలో 1383 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇక ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 37,22,912 టెస్టులు నిర్వహించారు. జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 973, చిత్తూరులో 936, తూర్పు గోదావరిలో 1383, గుంటూరులో 498, కడపలో 420, కృష్ణాలో 159, కర్నూలులో 686, నెల్లూరులో 1086, ప్రకాశంలో 524, శ్రీకాకుళంలో 1023, విశాఖలో 634, విజయనగరంలో 540, పశ్చిమ గోదావరిలో 1142 కేసులు నమోదయ్యాయి.
Also Read:
‘వైఎస్సార్ బీమా’ పధకం విధి విధానాలు.. జిల్లాల వారీగా ఫోన్ నెంబర్లు.!
ఏపీ: 1036 గ్రామ, వార్డు వాలంటీర్ల పోస్టులు.. వెంటనే దరఖాస్తు చేసుకోండిలా.!
”టాలీవుడ్లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవు”..
IPL 2020: ఒకే టీంలో కోహ్లీ, డివిలియర్స్, స్మిత్లు.. ఎప్పుడంటే..
సంచలన నిర్ణయం దిశగా జగన్ సర్కార్.. ఆన్లైన్ రమ్మీపై నిషేధం.!