ఏపీలో తగ్గుతున్న కరోనా.. కొత్తగా పాజిటివ్ కేసులు ఎన్నంటే.!
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,038 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,71,503కి చేరింది.
Coronavirus Positive Cases: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,038 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,71,503కి చేరింది. ఇందులో 40,047 యాక్టివ్ కేసులు ఉండగా.. 7,25,099 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 38 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,357కు చేరుకుంది. ఇక నిన్న 5,622 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.
నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 232, చిత్తూరు 489, తూర్పుగోదావరి 548, గుంటూరు 390, కడప 281, కృష్ణా 421, కర్నూలు 103, నెల్లూరు 178, ప్రకాశం 299, శ్రీకాకుళం 119, విశాఖపట్నం 196, విజయనగరం 96, పశ్చిమ గోదావరి 686 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,436కి చేరింది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 727 మంది కరోనాతో మరణించారు.