తెలంగాణలోని ఆ జిల్లాలో 10 రోజులు లాక్డౌన్..
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు దాదాపు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక పెద్దపల్లి జిల్లాలో కూడా రోజుకు పదుల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. తాజాగా నిన్న ఒక్క రోజే 12 కరోనా పాజిటివ్ కేసులతో పాటు...
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు దాదాపు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక పెద్దపల్లి జిల్లాలో కూడా రోజుకు పదుల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. తాజాగా నిన్న ఒక్క రోజే 12 కరోనా పాజిటివ్ కేసులతో పాటు ఒకరు మరణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ మేరకు పురపాలక సంఘం కౌన్సిలర్లతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. పట్టణంలోని వ్యాపారులు కూడా స్వచ్ఛంద లాక్డౌన్ ఖచ్చితంగా పాటించాలని, నిత్యవసర వస్తువులు, కూరగాయలు మాత్రమే కొద్ది సమయం పాటు విక్రయించాలన్నారు. అలాగే ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. కోవిడ్ బారిన పడకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. కాగా వ్యవసాయ దృష్ట్యా ఎరువులు, విత్తనాల కోసం దుకాణాలు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు. ఈ లాక్ డౌన్ రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలిపారు.
కాగా తెలంగాణలో శనివారం కొత్తగా 1,178 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఒక్కరోజే 1,714 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఇవాళ తొమ్మిది మంది మృతిచెందారు. ఒక్క హైదరాబాద్లోనే 736 మందికి కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. తెలంగాణలో మొత్తం పాజిటవ్ కేసుల సంఖ్య 33,402కు చేరింది. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 348కి పెరిగింది. రాష్ట్రంలో 12,135 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కొలుకొని 20,919 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Read More:
కేంద్రం ప్రత్యేక పథకం.. ఆడపిల్ల ఉంటే ఏడాదికి రూ.24 వేలు.. నిజమేనా?
టీటీడీ ఆస్తులపై ఈవో అనిల్ కుమార్ కీలక నిర్ణయం..
మోదీ సర్కార్ యాప్ ఛాలెంజ్.. రూ.15 లక్షలు గెలుచుకున్న ఏపీ విద్యార్థి..