కరోనా భయం.. వృద్ధ దంపతుల గెంటివేత..!
కరోనా భయం రోజు రోజుకు ఎక్కువవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి ఇప్పటికే 7వేలకు పైగా ప్రాణాలను తీసుకుంది. బాధితుల సంఖ్య గంట గంటకు పెరుగుతోంది.
కరోనా భయం రోజు రోజుకు ఎక్కువవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి ఇప్పటికే 7వేలకు పైగా ప్రాణాలను తీసుకుంది. బాధితుల సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. ఇదిలా ఉంటే కరోనా భయంతో వృద్ధ దంపతులను అపార్ట్మెంట్ నుంచి గెంటివేశారు. ఈ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. నగరంలోని అల్వాల్లో ఓ అపార్ట్మెంట్కు సంబంధించిన వృద్ధ దంపతులు ఇటీవలే విదేశాలకు వెళ్లి నగరానికి వచ్చారు. అయితే విదేశాలకు వెళ్లి వచ్చిన చాలామందిలో కరోనా లక్షణాలు బయటపడుతుంటంతో.. ఈ వృద్ధ దంపతులను అపార్ట్మెంట్ నుంచి వెళ్లిపోవాలని అక్కడి వారు ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అపార్ట్మెంట్ నుంచి వారిని బయటకు గెంటేశారు. దీంతో బిక్కుబిక్కుమంటూ ఆ వృద్ధ దంపతులు అపార్ట్మెంట్ బయట కూర్చున్నారు.