ఏపీలో నలుగురు డాక్టర్లకు కరోనా..
ఏపీలో నలుగురు వైద్యులకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. మార్చి 26న అనంతపురంలోని హిందూపురంలో 68 ఏళ్ల వద్ధుడు ఇటీవల కరోనా వైరస్తో మరణించాడు. ఆ వ్యక్తికి చికిత్స చేసిన నలుగురు వైద్యులకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందని..
ఏపీలో నలుగురు వైద్యులకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. మార్చి 26న అనంతపురంలోని హిందూపురంలో 68 ఏళ్ల వద్ధుడు ఇటీవల కరోనా వైరస్తో మరణించాడు. ఆ వ్యక్తికి చికిత్స చేసిన నలుగురు వైద్యులకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందని అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు వెల్లడించారు. అలాగే వారితో పాటు పనిచేసిన 25 మంది సిబ్బందిని కూడా క్వారంటైన్లో ఉంచి పర్యవేక్షిస్తున్నామని జిల్లా వైద్యాధికారి అనిల్ కుమార్ తెలిపారు. దీంతో పాటు అనంతపురం జిల్లాలోనే ఈ రోజు కొత్తగా ఏడు కరోనా పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 13కి పెరిగింది. మక్కా నుంచి వచ్చి ఇద్దరు, కళ్యాణ దుర్గం నుంచి ఢిల్లీ వెళ్లిన మరో వ్యక్తికి కరోనా కన్ఫామ్ అయినట్టు కలెక్టర్ తెలిపారు.
ఇక ఏపీలో కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 58 ప్రైవేట్ ఆస్పత్రులను తీసుకుంది. విశాఖలో 5, కృష్ణా జిల్లాలో 5, ప్రకాశంలో 4, నెల్లూరులో 5, కర్నూలులో 6, చిత్తూరులో 5, కడపలో 3, అనంతపురంలో 4, గుంటూరులో 4, తూర్పు గోదావరిలో 5, పశ్చిమగోదావరిలో 3, విజయనగరంలో 5, శ్రీకాకుళంలో 4 ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైరస్కు ఏర్పాట్లు చేస్తోంది. ఈ 58 ఆస్పత్రులో.. 19,114 పడకలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఆంధ్రాలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అవడంతో.. ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఏపీలో 348 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇప్పటివరకూ 4గురు మృతి చెందారు.
ఇవి కూడా చదవండి:
గుడ్న్యూస్: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి రూ.6 లక్షల ఇన్సూరెన్స్..
తెలంగాణ ప్రభుత్వానికి.. ‘మొగలి రేకులు’ ఫేమ్ ఆర్కే నాయుడు విరాళం
ఏప్రిల్ 11న ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. సీఎంలతో మరోసారి కాన్ఫరెన్స్
హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొడుతున్న ‘కరోనా కారు’
తెలంగాణలో హాట్ స్పాట్లుగా వంద ప్రదేశాలు.. మరింత కట్టుదిట్టం