మాస్క్ ధరించని వారిపై అధికారుల కొరఢా.. ఒకే రోజు 12 వేల మందికి జరిమానా.. రూ. 24 లక్షలు వసూలు
కరోనా మహమ్మారి తెస్తున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. కరోనా నుంచి రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని పదేపదే చెబుతున్నా.. కొందరు పెడచెవిన పెడుతున్నారు....
కరోనా మహమ్మారి తెస్తున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. కరోనా నుంచి రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని పదేపదే చెబుతున్నా.. కొందరు పెడచెవిన పెడుతున్నారు. అలాంటి వారిపై అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు. తాజాగా ముంబాయి మున్సిపల్ అధికారులు ఒకే రోజు మాస్కులు ధరించని 12 వేలకుపైగా మందిని పట్టుకుని రూ.24 లక్షలు జరిమానా వసూలు చేశారు. బీఎంసీ సిబ్బంది ఇప్పటి వరకు దాదాపు 68 లక్షల మంది నుంచి రూ.14 కోట్లకుపైగా జరిమానా వసూలు చేశారు. దీంతో బీఎంసీ ఖాజనాలో భారీగా ఆదాయం వచ్చి చేరింది. అయితే కరోనా మహమ్మారి తీవ్ర తగ్గుతుండటంతో కొంత ఊరటనిచ్చే విషయమే. ముంబాయిలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అలాగే మాస్కులు ధరించకుండా రోడ్లపై తిరుగుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. కరోనా నుంచి కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని పదేపదే చెబుతున్నా.. జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. కరోనా నిబందధనలను తుంగలో తొక్కేయడంతో రంగంలోకి దిగిన అధికారులు తగిన గుణపాఠం చెబుతున్నారు. కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ముంబాయి ఆరోగ్యశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
మాస్కులు తప్పనిసరి కాగా, కరోనాను కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం తప్పని సరి చేసింది. కొందరు కరనా నిబంధనలు పాటించకుండా బయటకు వచ్చి పట్టుబడితో భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నా.. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి రోజు 20 నుంచి 25 మంది పైన చర్యలు తీసుకోవాలని ఇటీవల బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చహల్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆరోగ్య సిబ్బందితో పాటు క్లీన్ అఫ్ మార్షల్స్ , అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ దాడులు చేస్తున్నారు.
కాగా, ప్రతి రోజు దాదాపు ఐదు వేల మందిని పట్టుకుని జరిమానా విధిస్తున్నారు. ఒకే రోజు ఇంత భారీ సంఖ్యలో జరిమానాలు విధించడం మొదటిసారి. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకకు 68,38,060 మందిపై చర్యలు తీసుకున్నారు. వీరి నుంచి రూ.14,04,06,200 జరిమానాలు వసూలు చేసినట్లు బీఎంసీ అధికారులు పేర్కొన్నారు.